epaper
Monday, January 19, 2026
epaper

భూపాలపల్లిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం

భూపాలపల్లిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
అటవీ భూముల‌ రక్షణకు రూ.3 కోట్లతో గోడ నిర్మాణం
మహిళా సంఘాలకు రూ.కోటి బ్యాంకు లింకేజీ
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌
రూ.500 కోట్లతో బైపాస్ రోడ్డు, రూ.664 కోట్లతో భూపాలపల్లి–గూడెప్పాడు రహదారి
ఎమ్మెల్యే గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌రావు

భూపాలపల్లి, కాకతీయ : భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీలోని 5, 6, 7, 26వ వార్డుల్లో చేపట్టనున్న అటవీ రక్షణ గోడ నిర్మాణ పనులు, మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంత్రి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ అడవి జంతువులు నివాస ప్రాంతాల్లోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో రూ.3 కోట్ల వ్యయంతో పటిష్టమైన అటవీ రక్షణ గోడ నిర్మిస్తున్నామని తెలిపారు. మహిళల పట్ల ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందని, అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు. సంక్రాంతి సారెగా ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టామని, మున్సిపల్ పరిధిలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు అందిస్తామని తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధికి వడ్డీ లేని రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు.

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు

ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, అర్హులైన వారందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్ అందిస్తున్నామని మంత్రి వివరించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో మహిళలకు సోలార్ ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు ఇస్తున్నామని చెప్పారు. గత పదేళ్లలో రాష్ట్రం వెనుకబాటుకు గురై ఉద్యోగాలు రాలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రూప్–1, 2, 3 ఉద్యోగాలతో పాటు ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు అన్ని వేళల్లో అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

అభివృద్ధికి రూ.60 కోట్ల నిధులు..

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ అడవులు చుట్టూ ఉండటంతో ప్రజలు ఎన్నో ఏళ్లుగా జంతువుల బెడదను ఎదుర్కొన్నారని, రక్షణ గోడతో సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. లక్ష జనాభా ఉన్న భూపాలపల్లిలో 30 వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, అన్ని కులాలకు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.60 కోట్లు మంజూరు చేసిందన్నారు. అదే విధంగా రూ.500 కోట్లతో బైపాస్ రోడ్డు, రూ.664 కోట్లతో భూపాలపల్లి–గూడెప్పాడు నాలుగు వరుసల రహదారి, ఆసుపత్రి అభివృద్ధి, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఇంటిగ్రేటెడ్ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, పారిశ్రామిక పార్క్, పట్టణ పార్కుల అభివృద్ధి వంటి అనేక పనులు చేపడుతున్నామని తెలిపారు. తన హయాంలో అభివృద్ధి జరగకపోతే రానున్న ఎన్నికల్లో ఓట్లు అడగనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, కోటి రూపాయల బ్యాంకు లింకేజీ, రూ.20 లక్షల వడ్డీ లేని రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. మహిళలు పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీ సంకీర్త్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, మెప్మా పీడీ రాజేశ్వరి, ఎంపీడీఓ తరుణ్ ప్రసాద్, మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉపాధ్యాయ బోధనలకు ప్రశంసలు

ఉపాధ్యాయ బోధనలకు ప్రశంసలు నెల్లికుదురు టీజీఎంఎస్‌లో ప్యానల్ తనిఖీ ఆధునిక బోధన, పరిపాలనపై పూర్తి...

మృతుల కుటుంబాలకు చల్లా పరామర్శ

మృతుల కుటుంబాలకు చల్లా పరామర్శ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాన‌ని హామీ కాకతీయ, గీసుగొండ...

యువతలో మార్పే ప్రమాదాలకు మందు

యువతలో మార్పే ప్రమాదాలకు మందు మద్యం మత్తులో డ్రైవింగ్ చేయొద్దు రోడ్డు భద్రతపై ప్రతి...

మహిళల భద్రతకు చట్టమే కవచం

మహిళల భద్రతకు చట్టమే కవచం ధైర్యంగా ఫిర్యాదు చేయాలి పోష్ యాక్ట్‌ను...

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత నిబంధనలు పాటిస్తేనే ప్రాణ రక్షణ...

గ్రామాభివృద్ధికి పక్కా ప్రణాళిక అవసరం

గ్రామాభివృద్ధికి పక్కా ప్రణాళిక అవసరం పారదర్శక పాలనతోనే ఆదర్శ గ్రామాలు నూతన సర్పంచులకు శిక్షణలో...

ప్రజా గొంతుకగా కాకతీయ ప‌త్రిక : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

ప్రజా గొంతుకగా కాకతీయ ప‌త్రిక : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాకతీయ, తొర్రూరు...

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కాక‌తీయ‌, మ‌రిపెడ : మరిపెడ మండలం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img