epaper
Thursday, January 15, 2026
epaper

జీవన్‌రెడ్డి ఆరోపణలపై చ‌ర్చిస్తాం ..

  • పార్టీలో ఆయ‌న సీనియ‌ర్ నేత
  • సురేఖ వివాదం ముగిసింది
  • తన కూతురు పొరపాటున మాట్లాడిందని సంజాయిషీ ఇచ్చారు
  • టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్
  • సున్నితమైన అంశాలపై సంయమనం పాటించాలి
  • జాగ్రత్తగా మాట్లాడాలని ప్ర‌జాప్ర‌తినిధుల‌కు సూచ‌న‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తనను మానసికంగా హింస పెడుతున్నారని.. ఆపార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేసిన భావోద్వేగ వ్యాఖ్యలపై టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. జీవన్ రెడ్డి తమ సీనియర్ నేత అని.. ఆయన చెప్తున్న అంశాలను పరిశీలిస్తామని చెప్పారు. జీవన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై అధ్యయనం చేస్తామన్నారు. జీవన్ రెడ్డికి ఏమైనా సమస్యలుంటే అక్కడి మంత్రి లక్ష్మణ్ పరిష్కరిస్తారని చెప్పారు. మంత్రుల్లో తనకంటే సీనియర్లు ఉన్నారని.. తనకంటే జూనియర్లు ఉన్నారని వ్యాఖ్యానించారు.

మంత్రులందరూ సమానమే..

నిన్నటితో మంత్రి కొండా సురేఖ వివాదం ముగిసిందని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. సున్నితమైన అంశాలపై స్పందించేటప్పుడు సంయమనం పాటించాలన్నారు. కొండా సురేఖతో మాట్లాడమని సీఎం రేవంత్ ఆదేశించారని.. ముఖ్యమంత్రికి మంత్రులందరూ సమానమేనని స్పష్టం చేశారు. సురేఖకు ఉన్న ఇబ్బందులను ముఖ్యమంత్రితో చెప్పానని.. తన కూతురు పొరపాటున మాట్లాడిందని కొండా దంపతులు విచారం వ్యక్తం చేశారని తెలిపారు. ఇక నుండి ఏ సమస్య ఉన్నా తనకే చెప్పమని సురేఖతో సీఎం రేవంత్ చెప్పారని వివరించారు. పార్టీలో ఉన్న సమస్యలను క్రమశిక్షణ కమిటీ పరిష్కరిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో సమస్యలను చాలా పెద్ద మనసుతో పరిష్కారం చేసుకుంటామని చెప్పారు.

వాడెవడు పెత్తనం చెలాయించడానికి ..

తనను హలాల్‌ చేసి రోజుకింత ఎందుకు చంపేస్తున్నారు ? అంటూ సోమవారం జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఒకేసారి చంపండంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ముందు అసహనం వ్యక్తం చేయ‌డం క‌ల‌క‌లంరేపింది. కమిటీలు, కాంట్రాక్టులు బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చినవారికే ఇస్తున్నారని మండిపడ్డారు. తాము వలసదారులమేమీ కాదని ఆగ్రహించారు. తాము కాంగ్రెస్‌ కౌలుదారులం కాదని.. పట్టాదారులమంటూ వ్యాఖ్యానించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘వాడెవడు అసలు మా మీద పెత్తనం చెలాయించడానికి ? మేము చెప్తే అభివృద్ధి చేయడం లేదు! ఫిరాయింపు ఎమ్మెల్యేల మాటలు వింటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అడిగితేనే అభివృద్ది చేస్తాం అని బోర్డు పెట్టుకున్నారా?’ అంటూ చేసిన ఘాటు వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img