epaper
Monday, March 2, 2026
epaper

వలసల పాలమూరును విద్య, పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

కాకతీయ, మహబూబ్‌నగర్ : దశాబ్దాల కరవు, వలసలు, వెనుకబాటుతనం నుంచి బయటపడి పాలమూరును ఉన్నత స్థానంలో నిలబెట్టడం తన నైతిక ధర్మమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని వేముల గ్రామంలో ఎస్‌జీడీ, కార్నింగ్ టెక్నాలజీస్ సంస్థ నిర్మించిన నూతన యూనిట్‌ను సీఎం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు ఒకనాడు వలసలకు మారుపేరుగా ఉండేదని గుర్తుచేసిన సీఎం, విద్యే మన తలరాతను మార్చగలదన్నారు. అందుకే జిల్లాలో ఇంజనీరింగ్, లా, మెడికల్ కాలేజీలు, బాసర తర్వాత రెండో ట్రిపుల్ ఐటీ, 14 నియోజకవర్గాల్లో 14 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు, ఏటీసీలను ఏర్పాటు చేశామని తెలిపారు.

పేద పిల్లలు చదువులో ముందుకు రావడం కోసం అన్ని వసతులు కల్పిమని స్పష్టం చేశారు. నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత పాలకులు ఆటంకాలు కలిగించారని విమర్శించిన ఆయన, ఉద్ధండాపూర్, మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ప్రాంతాలకు నీళ్ల కోసం గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేస్తామని, మంచి నష్టపరిహారం ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. రైతులను కార్యాలయాలకు పిలవకుండా, అధికారులు క్షేత్రస్థాయిలో కలుసుకోవాలని సూచించారు. బ్రహ్మోస్ మిస్సైల్ ఉత్పత్తి యూనిట్, డ్రైపోర్టు, హైదరాబాద్–బెంగళూరు డిఫెన్స్ కారిడార్‌ ప్రాజెక్టులను పాలమూరులోనే ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

విదేశీ బృందాలు ఒకనాడు పాలమూరు పేదరికాన్ని చూసేందుకు వచ్చాయి. ఇకపై ఇక్కడి అభివృద్ధిని, పరిశ్రమలను, విద్యా వసతులను చూడటానికి రావాలని, స్థానిక యువతకే కాక, ఇతర రాష్ట్రాల వారికీ ఉపాధి కల్పించే స్థాయికి పాలమూరు ఎదగాలి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, అనసూయ సీతక్క, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి, లోక్‌సభ సభ్యుడు మల్లు రవి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img