epaper
Monday, March 2, 2026
epaper

సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తాం.. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌పై రాంచందర్ రావు డిమాండ్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : వామన్ రావు.. నాగమణి న్యాయవాద దంపతుల హత్య కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు స్వాగతించారు. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వాల విచారణ సంస్థలపై పెరుగుతున్న ప్రజా అవిశ్వాసానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలన్న సుప్రీం కోర్టు నిర్ణయం, న్యాయం పట్ల విశ్వాసాన్ని మరింత బలపరుస్తుందని రాంచందర్ రావు అన్నారు. స్థానిక విచారణ సంస్థలు నిజాన్ని వెలికితీయడంలో విఫలమయ్యే భయం, సాక్ష్యాల మాయం, ఒత్తిళ్లతో కేసు బలహీనమయ్యే పరిస్థితులను ప్రజలు గమనించారని పేర్కొన్నారు.

భవిష్యత్తుకు గట్టి హెచ్చరిక కావాలి:

సీబీఐ విచారణ ద్వారా నిజానిజాలను వెలికితీసి, దోషులకు కఠిన శిక్షలు విధించాలని బిజెపి ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేసు భవిష్యత్తులో ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి హెచ్చరికగా నిలవాలని అన్నారు. ఎంఎల్సీగా ఉన్న సమయంలోనే న్యాయవాదుల భద్రత కోసం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేకసార్లు డిమాండ్ చేశానని రాంచందర్ రావు గుర్తుచేశారు. ఈ అంశాన్ని శాసన మండలిలో పునరావృతంగా ప్రస్తావించినప్పటికీ అప్పటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని తెలిపారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ చట్టాన్ని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

బిజెపి పోరాటం కొనసాగుతుంది:

వామన్ రావు దంపతుల హత్యలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని రాంచందర్ రావు అన్నారు. న్యాయవాదుల భద్రత, గౌరవం కోసం బిజెపి పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img