epaper
Thursday, January 15, 2026
epaper

సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తాం.. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌పై రాంచందర్ రావు డిమాండ్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : వామన్ రావు.. నాగమణి న్యాయవాద దంపతుల హత్య కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు స్వాగతించారు. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వాల విచారణ సంస్థలపై పెరుగుతున్న ప్రజా అవిశ్వాసానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలన్న సుప్రీం కోర్టు నిర్ణయం, న్యాయం పట్ల విశ్వాసాన్ని మరింత బలపరుస్తుందని రాంచందర్ రావు అన్నారు. స్థానిక విచారణ సంస్థలు నిజాన్ని వెలికితీయడంలో విఫలమయ్యే భయం, సాక్ష్యాల మాయం, ఒత్తిళ్లతో కేసు బలహీనమయ్యే పరిస్థితులను ప్రజలు గమనించారని పేర్కొన్నారు.

భవిష్యత్తుకు గట్టి హెచ్చరిక కావాలి:

సీబీఐ విచారణ ద్వారా నిజానిజాలను వెలికితీసి, దోషులకు కఠిన శిక్షలు విధించాలని బిజెపి ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేసు భవిష్యత్తులో ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి హెచ్చరికగా నిలవాలని అన్నారు. ఎంఎల్సీగా ఉన్న సమయంలోనే న్యాయవాదుల భద్రత కోసం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేకసార్లు డిమాండ్ చేశానని రాంచందర్ రావు గుర్తుచేశారు. ఈ అంశాన్ని శాసన మండలిలో పునరావృతంగా ప్రస్తావించినప్పటికీ అప్పటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని తెలిపారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ చట్టాన్ని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

బిజెపి పోరాటం కొనసాగుతుంది:

వామన్ రావు దంపతుల హత్యలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని రాంచందర్ రావు అన్నారు. న్యాయవాదుల భద్రత, గౌరవం కోసం బిజెపి పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మంత్రి వివేక్ చిర్రు బుర్రు..!

మంత్రి వివేక్ చిర్రు బుర్రు..! స‌మ‌స్య‌లు విన్న‌వించేందుకు స్థానికుల య‌త్నం వింటా..వింటా అంటూనే జ‌నంపై...

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img