epaper
Thursday, January 15, 2026
epaper

డ్రగ్స్‌ రహిత జిల్లా లక్ష్యంగా పనిచేయాలి

డ్రగ్స్‌ రహిత జిల్లా లక్ష్యంగా పనిచేయాలి
రైల్వే, బస్ స్టేషన్ల‌లో నిఘా పెంచాలి
ప్రత్యేక తనిఖీలతో ర‌వాణాను అరిక‌ట్టాలి
మాదకద్రవ్యాల నిరోధక పై విస్తృతంగా ప్రచారం కల్పించాలి
మ‌హ‌బూబాబాద్‌ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

కాక‌తీయ‌, మ‌హ‌బూబాబాద్ : జిల్లాను డ్రగ్స్‌ రహిత జిల్లాగా చేయడంలో అధికారులు, పోలీసు శాఖ సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్‌ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ తో కలిసి నేషనల్‌ నార్కోటిక్స్‌ కో-ఆర్డినేషన్‌ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరైనా మాదక ద్రవ్యాల రవాణా, వినియోగం చేస్తే ఎన్డీపీఎస్‌ చట్టం ప్రకారం శిక్షార్హులవుతారని తెలిపారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని కళాశాలల్లో పోలీసు శాఖ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మాదకద్రవ్యాల అలవాటుకు ఎవరూ బానిసలు కారాదని, ముఖ్యంగా యువత మేల్కొని డ్రగ్స్‌ను వదులుకోవాలని సూచించారు. వైద్య, ఆరోగ్యం, రెవెన్యూ, విద్య, అటవీ, డ్రగ్స్‌ తదితర శాఖల అధికారులు అందరూ పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేయాలని తెలిపారు. జిల్లాలోని రెవెన్యూ, మార్కెటింగ్‌, అటవీ, పోలీసు అన్ని చెక్‌పోస్టుల్లో పటిష్ట నిఘా పెట్టాలని చెప్పారు. డిగ్రీ, ఇంటర్మీడియట్‌ కాలేజీల ప్రిన్సిపాల్స్‌, ఎంఈవోలతో శిక్షణా అవగాహన కార్యక్రమాలు చేయాలని, అలాగే అందరూ వైద్యాధికారులు, ఏరియా హాస్పిటల్స్‌, సీహెచ్‌సీలలో ఎక్కడైనా మాదక ద్రవ్యాలు సేవించి ఎవరైనా వస్తే అలాంటి వారి వివరాలను పోలీసు శాఖకు అందజేయాలని సూచించారు. అలాగే వీఆర్‌ఏ, వీఆర్‌వోలకు గ్రామాల్లో డ్రగ్స్‌ సేవిస్తున్న వారి వివరాలను తెలియజేసేలా తగు ఆదేశాలు జారీ చేయాలని ఆర్డీవోలకు సూచించారు. జిల్లాలో విస్తృత ప్రత్యేక తనిఖీలు నిర్వహించి డ్రగ్స్ ల నాణ్యత ప్రమాణాలు, మందుల చిట్టి లేకుండా మందులు లేకుంటే ఎట్టి పరిస్థితిలో మందులు పంపిణీ చేయబడదని సంబంధిత మెడికల్ షాపుల యజమానులకు తెలిపాలని అన్నారు. సమావేశంలో డీఎస్పీ తిరుపతి రావు,ఎక్సైజ్ శాఖ అధికారి కిరణ్ కుమార్ , ట్రైబల్ వెల్ఫేర్ అధికారి దేశీ రామ్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల, డ్రెస్ ఇన్స్పెక్టర్ ఉమారాణి, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img