హామీల అమలుపై నిలదీయాలి
బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్
కాకతీయ, కరీంనగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజులు” పేరుతో మరోసారి అబద్ధాలతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ విమర్శించారు. రెండు సంవత్సరాల క్రితం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పట్లో ప్రజాపాలన పేరుతో గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ఆరు పథకాల పేరిట లక్షలాది దరఖాస్తులు స్వీకరించిందన్నారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు, ఇచ్చిన హామీలను మరిపించేందుకు ఇప్పుడు ప్రగతి ప్రణాళిక పేరుతో మరో నాటకానికి తెరతీసిందన్నారు. ఇప్పటికైనా ప్రజలు కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, కరీంనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, పార్టీ డివిజన్ అధ్యక్షులు తొంటి రాజేందర్, ఆరె రవి గౌడ్, చేతి చంద్రశేఖర్, బండి శ్రీకాంత్, నారదాసు వసంతరావు, నాగుల కిరణ్ కుమార్ గౌడ్, సత్తినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


