epaper
Thursday, January 15, 2026
epaper

మేం గొప్ప‌లు చెప్పుకోవ‌డం లేదు

మేం గొప్ప‌లు చెప్పుకోవ‌డం లేదు
ప్ర‌భుత్వ అభివృద్ధిని శ్రేణుల‌కు ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి
కొన్ని పార్టీలు మూడు ద‌శాబ్దాల క్రితం చేసిన‌వి కూడా చెప్పుకుంటున్నాయి
కాంగ్రెస్ చేసిన ప‌నులు చెబితే ఇంకో పార్టీకి భవిష్యత్తే ఉండదు
మధిర మున్సిపాలిటీలో గెలుపే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలి
రేపటి తరాల భవిష్యత్తు కోస‌మే మ‌ధిర అభివృద్ధి
క్లీన్ అండ్ గ్రీన్ నగరాన్ని కోరుకునే వారినే గెలిపించాలి
మధిర మున్సిపల్ కీలక నేతల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఇంకో పార్టీకి ఈ దేశంలో భవిష్యత్తే ఉండదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వ్యాఖ్యానించారు. ఇతర పార్టీలు రెండు మూడు దశాబ్దాల క్రితం చేసిన కొద్దిపాటి పనులను మైకు దొరికిన ప్రతిసారి చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటుంటే, కాంగ్రెస్ శ్రేణులు తమ ప్రభుత్వం చేస్తున్న గొప్ప పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెనుకంజలో ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లిలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.

మధిర మున్సిపాలిటీ గెలుపే లక్ష్యం
మధిర మున్సిపాలిటీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మధిర నగరానికి అందించిన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను ప్రతి నాయకుడు రోజుకు కనీసం పదిమందికి వివరించగలిగితే చాలని సూచించారు.
మధిర పట్టణం క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా మారితేనే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని అన్నారు. ఆ దిశగా ఆలోచించే, అభివృద్ధిని కోరుకునే వ్యక్తులనే ప్రజలు గెలిపించుకోవాలని సూచించారు. మధిర పట్టణానికి కాంగ్రెస్ చేయని అభివృద్ధి పని అంటూ ఏదీ లేదని స్పష్టం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ, చెరువులను టూరిజం పార్కులుగా అభివృద్ధి చేయడం, డిగ్రీ, ఇంటర్, హైస్కూల్ విద్యాసంస్థలకు సొంత భవనాలు, అగ్రికల్చర్ పాలిటెక్నిక్, జనరల్ పాలిటెక్నిక్, ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చడం, బస్టాండ్, ట్రెజరీ, బ్యాంకుల ఏర్పాటు వంటి అనేక కీలక అభివృద్ధి పనులు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని తెలిపారు.

డ్రైనేజీ పనులు పూర్తైతే నగర స్వ‌రూప‌మే మారుతుంది

ఒక మంచి ఇల్లు కట్టే సమయంలో మొదట సిమెంట్, కంకర, ఇటుకలు చిందరవందరగా కనిపిస్తాయని, కానీ ఇల్లు పూర్తయిన తర్వాతే అందంగా కనిపిస్తుందని ఉపమానం చెప్పారు. అదే విధంగా ప్రస్తుతం జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయితే మధిర పట్టణం పూర్తిగా సుందరంగా మారుతుందని తెలిపారు. డ్రైనేజీ పనులు పూర్తయిన ప్రాంతాల్లో మట్టిని వెంటనే పూడ్చాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. డ్రైనేజీ పనులు పూర్తయిన అనంతరం మధిర నగరం అంతటా కొత్త సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. టాయిలెట్ల మురుగునీరు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు వెళ్లి శుద్ధి అనంతరం విడుదల అవుతుందని, వర్షపు నీటిని ఏట్లోకి మళ్లించేందుకు ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ ఉంటుందని వివరించారు. మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటేనే అభివృద్ధి పనులు కొనసాగుతాయని, పట్టణం అభివృద్ధి చెందితే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img