epaper
Wednesday, March 4, 2026
epaper

పదేళ్ల తప్పులు సరిదిద్దుతున్నాం!

పదేళ్ల తప్పులు సరిదిద్దుతున్నాం!
కక్షసాధింపు అనడం సిగ్గుచేటు
ఇష్టమొచ్చినట్లు జిల్లాల విభజన బీఆర్ఎస్ పాపం
వరంగల్ విభజనపై బహిరంగ చర్చకు సిద్ధమా?
రెండేళ్లలోనే 61,379 ఉద్యోగాలు భర్తీ
మేడారంలో వందేళ్లు నిలిచేలా అభివృద్ధి
కండ్లుండి చూడలేని కబోదుల్లా బీఆర్ఎస్ నేతలు
హన్మ‌కొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల

కాకతీయ, హనుమకొండ : సంక్షేమం, అభివృద్ధితో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేస్తున్న ప్రజా ప్రభుత్వంపై ఓర్వలేని తనంతోనే ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఖండించారు. ప్రజా ప్రభుత్వాన్ని కక్షసాధింపు చర్యల పాలనగా అభివర్ణించడం సిగ్గుచేటని ఇనగాల విమర్శించారు. నిజంగా తమ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగితే బీఆర్ఎస్ నేతలంతా ఇప్పటికే జైళ్లలో ఉండేవారని వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. కండ్లముందే జరుగుతున్న అభివృద్ధిని చూడలేని కబోదుల్లా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండేళ్లలోనే ఉద్యోగ విప్లవం

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 61,379 ఉద్యోగాలు భర్తీ చేసిందని ఇనగాల గుర్తు చేశారు. ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటే, ‘ఇంటికో ఉద్యోగం’ అని చెప్పి పదేళ్లపాటు నిరుద్యోగులను మోసం చేసిన మాజీ సీఎం కేసీఆర్ ప్రతి నిరుద్యోగి ఇంటి ముందు ముక్కు నేలకు రాయాలన్నారు. ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని స్పష్టం చేశారు. జిల్లాల విభజనను బీఆర్ఎస్ ప్రభుత్వం అస్తవ్యస్తంగా, శాస్త్రీయత లేకుండా చేసిందని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆరోపించారు. ప్రజలే ఆ ఘన కార్యాన్ని తిరస్కరిస్తున్నారని, అందుకే జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. పాలనా సౌలభ్యం పేరుతో ఇష్టమొచ్చినట్లు జిల్లాలను విభజించిన మీరు ఇప్పుడు ప్రశ్నలు అడుగుతారా అని మండలి ప్రతిపక్ష నేత సిరికొండపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరంగల్‌ను రెండు జిల్లాలుగా చేసి ఒకే చోట హెడ్‌క్వార్టర్లు పెట్టడం ఏ పాలనా సౌలభ్యం కోసమో వరంగల్‌లో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

మేడారంలో వందేళ్ల అభివృద్ధి

మేడారం జాతర పనులు పూర్తికాలేదని విమర్శించే వారు అక్కడికి వెళ్లి చూడాలని ఇనగాల సూచించారు. మేడారం అభివృద్ధికి రూ.250 కోట్లు కేటాయించామని, అందులో రూ.150 కోట్లు నేరుగా జాతర ఏర్పాట్ల కోసమేనని తెలిపారు. చేపట్టిన పనులు ఇప్పటికే 95 శాతం పూర్తయ్యాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాటు మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కేసీఆర్ సీఎంగా ఎన్ని సార్లు మేడారం వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మేడారాన్ని చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేస్తున్నారని, జాతరకు మూడు నెలల ముందే సమీక్ష నిర్వహించిన తొలి సీఎం ఆయనేనని గుర్తు చేశారు. ఈ నెల 18న ఏకంగా మేడారంలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.

ఆనాడు చేసిన కక్ష మరిచారా?

జర్నలిస్టులపై కేసులంటూ మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై కక్షసాధింపు చర్యలు చేపట్టిన విషయం మరిచారా అని ఇనగాల ప్రశ్నించారు. నమస్తే తెలంగాణ పత్రికను లాక్కోవడం, మోజో టీవీని కనుమరుగు చేసి జర్నలిస్టులను రోడ్డున పడేసిన చరిత్ర గుర్తులేదా అంటూ నిలదీశారు. తమకు నచ్చని, తమను ప్రశ్నించిన వారిని పదేళ్ల పాటు జైళ్లలో పెట్టిన బీఆర్ఎస్‌కు, ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కక్షసాధింపు ఆరోపణలు చేసే నైతిక హక్కు లేదన్నారు. ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై ఫొటో మార్ఫింగ్ కేసులు పెట్టింది ఎవరో ప్రజలు మర్చిపోలేదన్నారు. జర్నలిస్టులపై కేసులు ప్రభుత్వం పెట్టలేదని, ఐఏఎస్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే దాన్ని ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తేల్చిచెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరలో ప్రభల హోరు..

కొమ్మాల జాతరలో ప్రభల హోరు.. జాత‌ర‌లో రాజకీయ ఆధిప‌త్య‌ రంగు..! భక్తులతో కిటకిటలాడిన జాతర...

పోడు భూములకు పట్టాలివ్వాలి

పోడు భూములకు పట్టాలివ్వాలి తుడుం దెబ్బ డిమాండ్ కాకతీయ, ఏటూరునాగారం : పోడు భూములకు...

డ్రైవర్ల పోరాటానికి ఫలితం

డ్రైవర్ల పోరాటానికి ఫలితం జీతభత్యాలపై చ‌ర్చ‌లు స‌ఫ‌లం నూతన వేతనాల ఒప్పందం ఖరారు కాకతీయ, నర్సంపేట...

నాగలక్ష్మి ఆలయంలో చోరీ

నాగలక్ష్మి ఆలయంలో చోరీ విగ్ర‌హాలు విలువైన సామాగ్రి అప‌హ‌ర‌ణ‌ ఆకులవారి ఘనపురంలో ఘ‌ట‌న‌ గ్రామంలో...

అడవులను ర‌క్షించాలి

అడవులను ర‌క్షించాలి వ‌న్య‌ప్రాణులను కాపాడుకోవాలి ఫారెస్ట్ అధికారుల బైక్ ర్యాలీ కాకతీయ, ఏటూరునాగారం : ములుగు...

భూపాలపల్లి చింత‌కానిలో అద్భుతం

భూపాలపల్లి చింత‌కానిలో అద్భుతం వాగులో విష్ణుమూర్తి పొలిక‌ల‌తో ఉన్న విగ్ర‌హం ల‌భ్యం వేల ఏళ్ల...

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి సప్తవర్ణ అభిషేకం..

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి సప్తవర్ణ అభిషేకం.. స్వామివారికి హోలీ ప్రత్యేక పూజలు.. కాకతీయ,గీసుగొండ: ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన...

కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! కొమ్మాల జాతర ఉత్సవ కమిటీ ఏర్పాటు వీరాటి రవీందర్ రెడ్డి అధ్యక్షుడిగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img