epaper
Thursday, January 15, 2026
epaper

నీరుగల్లు!

  • వరంగల్ కు తప్పని వానగండం
  • ఎప్పుడు వర్షం పడినా ఇదే గతి
  • తప్పు ఎవరిదైనా తిప్పలు అందరికీ
  • తుపాను ప్రభావంతో నగరం నలుదిక్కులు ముంపే
  • వరద దాటనిదే వరంగల్ కు చేరుకోలేని దుస్థితి
  • ముంపు నివారణ చర్యలు నేతల మాటలకే పరిమితం
  • పరామర్శలు తప్ప ప్రత్యేక కార్యాచరణ శూన్యం

కాకతీయ, వరంగల్ : అందమైన ఓరుగల్లు.. వాన పడితే అందవిహీనం.. ఇదీ మహాచరిత్ర కలిగిన వరంగల్ మహానగరం దుస్థితి. వానాకాలం అనేకాదు.. ఎప్పుడు ఏ రూపంలో వర్షం పడినా నగరం ముంపునకు గురవుతూనే ఉంది. శాశ్వత పరిష్కారం మారుతున్న ప్రజాప్రతినిధులు, అధికారుల మాటలకే పరిమితమవుతోంది. ఈ ఏడాది వానాకాలం ముంపు నుంచి నగరం బయటపడిందనుకునే లోపే.. మొంథా తుపాను ప్రభావంతో మరోసారి ముంపును చవిచూడాల్సి వచ్చింది. బుధవారం పొద్దంతా కురిసిన ఏకధాటి వర్షంతో నగరం నలుదిక్కులా వరద పోటెత్తింది. గడిచిన 30ఏళ్లలో ఇదే పెద్ద ముంపు అనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

యథా రాజా.. తథా ప్రజా..!

యథా రాజా.. తథా ప్రజా అనే సామెత నగరం ముంపు సమస్యకు అర్ధం చేకూర్చుతోంది. శిఖం భూములు, చెరువు స్థలాలు, నాలాలు ఆక్రమణలకు బడా నేతలు, వ్యాపారవేత్తలు, గల్లీ నాయకులు అండగా నిలుస్తున్నారనే వాదనలు నగర ప్రజల నుంచి వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయినా నేటికి మిగిలిన కొద్దిపాటి కుంటలు, చిన్నచిన్న మోరీలపైనా నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి. అడ్డుకోవాల్సిన అధికారులు బిక్కమొహం వేసుకుని అక్రమాలకు, ఆక్రమణదారులకు వంతపాడుతుండడంతో నగరానికి ముంపు సమస్య రోజురోజుకు తీవ్రమవుతూనే ఉంది. అధికారుల దాష్టీకానికి, నాయకుల దౌర్జన్యానికి ముంపు సమస్యను ప్రత్యక్షంగా ఎదుర్కొనే వారు వందల సంఖ్యలో ఉంటే… పరోక్షంగా ఇబ్బందులు పడే
వారు వేలల్లో ఉందడం గమనార్హం.

నగరం మధ్యలోనే మునక..!

నగరం మధ్యలోనే ప్రధాన చెరువులు ఉన్నాయి. భద్రకాళి చెరువు వరంగల్ నగరం నడిబొడ్డున వెలిసింది. హన్మకొండలోనూ ముంపు ప్రాంతాలు సైతం ఒకప్పటి పంట పొలాలు, శిఖం భూములని రికార్డులు తేటతెల్లం చేస్తున్నాయి. కాలక్రమేణా రికార్డులు మాసిపోయాయి. శిఖం భూములు ప్లాట్లుగా మారాయి. పంట పొలాలు నివాస స్థలాలుగా రూపుదిద్దుకున్నాయి. భద్రకాళి చెరువు శిఖం మొత్తం అపార్టుమెంట్లు వెలిశాయి. ఈ క్రమంలో వర్షపు నీరు చేరుకునే జలాశయాలు కుచించుకుపోవడంతో ఆ నీరంతా వరద రూపంలో శిఖం భూముల్లో వెలిసిన నివాసాలను ముంచెత్తుతోంది. ఆ వరద ఉదృతంగా మారి వీధుల్లోకి చేరి.. రహదారులను ముంచుతోంది. బుధవారం కురిసిన ఏకథాటి వర్షంతో కూడా అదే జరిగింది. నగరం నలుదిక్కులు వరదతో మూసుకుపోయాయి.

మాటలకే పరిమితం!

ముంపు సమస్య ఎదురైనప్పుడల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు కార్లలో దిగి.. తామున్నామంటూ ఆహార పొట్లాలు పంచడానికే పరిమితమవుతున్నారు. మళ్లీ వచ్చే ఏడాదికల్లా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారమంటూ ఊదరగొట్టి వెళ్తున్నారు. అనుకోకుండా వర్షాల వల్ల కలిగే అనర్థాలకు కాలం మీదే తప్పును నెట్టేసి.. మాటలతోనే మాయ చేస్తున్నారు.

మునగని ప్రాంతాలు ఇవే

నగరం మధ్యలో ఏర్పడే వరద ముంపు.. ఇతర ప్రాంతాలకు చుట్టుకుంటున్నదనేది వాస్తవం. అయితే, నగరంలో ఎలాంటి వర్షం పడినా ముంపునకు గురికాని ప్రాంతాలు కూడా ఉన్నాయి. నగరానికి ఎత్తు భాగంలో ఉన్న ఖిలావరంగల్ తూర్పు కోట ఇప్పటివరకు మునిగిన దాఖలాలు లేవు. వరంగల్ చౌరస్తాలో వరదనీరు పోటెత్తినా, అండర్ బ్రిడ్జి మునిగిపోయినా.. రామన్న పేటకు ఒకవైపు ముంపులో కూరుకున్నా.. కాశిబుగ్గ లోపలి ఏరియాలు నీటిలో తేలియాడినా.. భద్రకాళి శిఖం వైపు రహదారి మూసుకుపోయినా.. ఉరుసు గుట్ట పాత కరీమాబాద్, దేశాయిపేట, పాత కాశిబుగ్గ ప్రాంతం, వరంగల్ బస్టాండ్ ఏరియా.. చౌరస్తా నుంచి పోచమ్మ మైదాన్ ఏరియాలో మధ్యలో గల ప్రాంతం సురక్షితంగా ఉంటున్నాయి. ఈ ప్రాంతాల్లో చెరువులు గానీ, శిఖం భూములు గానీ లేకపోవడమే ఇందుకు కారణం కావచ్చు. అయితే, ముంపునకు గురయ్యే ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో ఈ ప్రాంతాలకు కాసింత ప్రమాదం పొంచి ఉంటుంది.

అధికారులు మారాలి.. పాలకులు పైరవీలు మానుకోవాలి..!

ఇప్పటికైనా అధికారులు మారాలి. శిఖం భూములు, పంటపొలాల్లో వెలిసిన ప్లాట్లకు అధికారులు అనుమతులు నిరాకరించాలి. నాలాలపై వెలిసిన నిర్మాణాలను నిర్మొహమాటంగా తొలగించాలి. తాజాగా శిఖం భూముల్లో చేపడుతున్న నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలి. ఇదే క్రమంలో నగరంలో డ్రైనేజీ వ్యవస్థను విస్త్రత పరచాలి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఆక్రమణలకు వత్తాసు త్తాసు పలకడం మానుకోవాలి. పైరవీలు చేస్తూ ఉన్న కొద్దిపాటి కుంటలను అంతరించుకుపోయేలా చేయడానికి పూనుకోవద్దు. ప్రజలు కూడా శిఖం భూముల్లో సాగే నిర్మాణాలను అడ్డుకోవాలి. లేదంటే.. చారిత్రక వరంగల్ నగరం.. ఎప్పటికీ వానగండం నుంచి బయటపడదనే నగ్న సత్యాన్ని గుర్తించాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img