epaper
Thursday, January 15, 2026
epaper

జ‌ల‌దిగ్బంధంలో వ‌రంగ‌ల్

  • హ‌న్మకొండ‌లో వందేళ్ల త‌ర్వాత అత్యంత భారీ వ‌ర్షం
  • బుధ‌వారం ఏక‌ధాటిగా 15 గంట‌ల పాటు వ‌ర్షం
  • ఏకంగా 39 సెం.మీ వ‌ర్ష‌పాతం న‌మోదు
  • గ‌ణాంకాలు వెల్ల‌డించిన వాతావ‌ర‌ణ‌శాఖ
  • 1903లో ఇంతటి భారీ వ‌ర్షం న‌మోదైన‌ట్లు వెల్ల‌డి
  • భారీ వ‌ర్షానికి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా అత‌లాకుత‌లం
  • జ‌ల దిగ్జంధంలోనే ఓరుగ‌ల్లు మ‌హాన‌గ‌రం విల‌విల‌
  • చెరువుల‌ను త‌ల‌పిస్తున్న వంద‌లాది కాల‌నీలు
  • రంగంలోకి విప‌త్తు నిర్వ‌హ‌ణ సిబ్బంది
  • లోత‌ట్టు ప్రాంతాల్లో ముమ్మ‌రంగా స‌హాయ‌క చ‌ర్య‌లు
  • పున‌రావాస కేంద్రాల్లో వ‌ర‌ద బాధితులు
  • బాధితుల‌కు అండ‌గా నిలిచిన ప్ర‌జాప్ర‌తినిధులు
  • ముంపు ప్రాంతాల్లో క‌లెక్టర్లు, సీపీ, అధికారుల ప‌ర్య‌ట‌న‌

 

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో/ వ‌రంగ‌ల్ : మోంథా తుఫాన్‌ దెబ్బకు గతంలో ఉన్న వర్షపాతం రికార్డుల‌న్నీ బ్రేక్ అయ్యాయి. బుధవారం ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు దంచికొట్టిన భారీ వర్షం వందేళ్ళ రికార్డును తిరగరాసింది. 1903 త‌ర్వాత హనుమకొండలో మ‌ళ్లీ అంత‌టి వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. 12 నుంచి 15 గంటల్లోనే ఏక‌ధాటిగా కురిసిన వ‌ర్షం 39 సెంటీమీట‌ర్ల‌కుపైగా న‌మోదైన‌ట్లు అధికారులు తెలిపారు. గత పదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ నెలలో కురిసిన వర్షాల్లో బుధవారం హనుమకొండలో పడినదే అత్యధిక వర్షపాతం అని చెబుతున్నారు. అక్టోబ‌ర్ నెల‌లో ఎప్పుడూ ఇంత వ‌ర్షపాతం న‌మోదైన‌ట్లు ఘ‌నాంకాల్లో లేద‌ని పేర్కొన్నారు. అదేవిధంగా హ‌న్మ‌కొండ‌తోపాటు వ‌రంగ‌ల్‌, మ‌హ‌బూబాబాద్‌, జ‌న‌గామ జిల్లాల్లోని 11 చోట్ల అత్యంత భారీ వ‌ర్ష‌పాతం న‌మోద‌వ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా రాష్ట్రంలో 30 చోట్ల అతిభారీ వ‌ర్షాలు కురిశాయి. 12 నుంచి 20 సెంటీమీట‌ర్ల వ‌ర‌కు న‌మోదైంది. 46 చోట్ల 7 నుంచి 12 సెంటీమీట‌ర్ల వ‌ర‌కు, 123 చోట్ల 2నుంచి 7 సెంటీమీట‌ర్ల వ‌ర‌కు వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ‌శాఖ వెల్ల‌డించింది.

జ‌ల‌దిగ్బంధంలో వ‌రంగ‌ల్‌

మోంథా తుఫాన్ ధాటికి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. బుధవారం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల‌న్నీ జలమయం అయ్యాయి. వంద‌లాది కాలనీలో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ములుగు రోడ్డు వద్ద నాలా ఉధృతంగా ప్రవహిస్తుండ‌టంతో సంతోషమాత కాలనీ, డీకే నగర్, ఎస్ ఆర్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేష్ కాలనీల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరుకుంది. దీంతో స్థానికులు ఇళ్లపైకెక్కి సహాయక చర్యల కోసం ఎదురు చూశారు. ఎన్ డి ఆర్ ఎఫ్, రెస్క్యూ టీంలు బోట్ల సహాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నగరంలోని పలుచోట్ల ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాల్లో వ‌ర‌ద బాధితులు త‌ల‌దాచుకున్నారు. వరంగల్ భద్రకాళి ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆలయం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు రోడ్డు జలమ‌యమైంది. వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న బాధితుల‌కు డ్రోన్ల సాయంతో ఆహార‌పొట్లాలు, తాగునీరు అంద‌జేశారు.

హ‌న్మ‌కొండ‌లో నీట మునిగిన కాల‌నీలు

వ‌రంగల్ నగరంతో పాటు హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు, రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి, వరంగల్ హన్మకొండను అనుసంధానం చేసే హంటర్ రోడ్డు పూర్తిగా జ‌ల‌మ‌య‌మైంది. బొంది వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హనుమకొండ పరిధిలోని వడ్డేపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీలోకి వచ్చి చేరుతోంది. దీంతో జవహర్ నగర్ కాలనీ, గోపాల్‌పూర్, 100 ఫీట్ల రోడ్డు పూర్తిగా నీట‌మునిగాయి. కాజీపేట నుంచి హనుమకొండ మార్గంలోని సోమిడి, గోపాల్‌పూర్ చెరువు నిండిపోవ‌డంతో కట్టలు తెగాయి. భారీగా వరద నీరు రోడ్డుపైకి చేరడంతో రాకపోకలు స్తంభించాయి. వివేక్ నగర్, అమరావతి నగర్, ప్రగతి నగర్ కాలనీలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో బైక్‌లు, కార్లు జల ప్రవాహంలో కొట్టుకుపోయాయి.

ఆందోళన వద్దు.. అండగా ఉంటాం : కొండా సురేఖ

వరంగల్, హ‌న్మ‌కొండ పరిధిలోని వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్‌రెడ్డి అధికారుల‌తో క‌లిసి ప‌ర్య‌టించారు. వేగంగా స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. వ‌రంగ‌ల్ ఎన్ఎన్ నగర్, బీఆర్ నగర్ ప్రాంతాల్లో మంత్రి కొండా సురేఖ కలెక్టర్ డాక్ట‌ర్ సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి క్షేత్రస్థాయిలో వరద ముంపు ప్రాంతాలు ప‌రిశీలించారు. బాధితులను పరామర్శించి, కొనసాగుతున్న సహాయక చర్యలను ప్రత్యక్షంగా మంత్రి సమీక్షించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రతి బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌న్నారు. సహాయం అందించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని బాధితుల‌కు మంత్రి కొండా సురేఖ భరోసా కల్పించారు.

బాధితుల‌కు ఎంపీ కావ్య భ‌రోసా..

వరద ప్రభావిత ప్రాంతాల్లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య విస్తృతంగా పర్యటించారు. ఎన్డీఆర్ఎఫ్ బోటులో లోతట్టు ప్రాంతాలకు చేరుకుని పాల ప్యాకెట్లు, తాగునీరు, ఆహారాన్ని స్వయంగా అందజేశారు. వరద ప్రాంతాల్లో డ్రోన్‌ల ద్వారా ఆహారం, తాగునీరు పంపిణీ విధానాన్ని పరిశీలించారు. గోపాలపురం ప్రాంతంలో వరద ఉధృతి తీవ్రతను గమనించిన ఎంపీ వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. వరంగల్ బీఆర్ నగర్ కాలనీ వరద ప్రభావిత ప్రాంతాన్ని కావ్య స్వయంగా పర్యవేక్షించారు. అక్కడ డ్రోన్‌ల ద్వారా ఆహారం, తాగునీరు పంపిణీ జరుగుతున్న విధానాన్ని మంత్రి కొండ సురేఖ, కలెక్టర్ డాక్టర్ సత్య శారద తో కలిసి పరిశీలించారు. ప్రతి కుటుంబానికి సహాయం వేగంగా చేరేలా అధికారులకు సూచనలు చేశారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతాయని ఎంపీ భరోసా ఇచ్చారు.

473 విద్యార్థినుల‌ను ర‌క్షించిన ఎన్‌డీఆర్ఎఫ్‌ బృందాలు

హంటర్ రోడ్‌లోని జ్యోతిరావు పూలే డిగ్రీ కాలేజీలో వరదల్లో చిక్కుకున్న 473 బాలికలను ఎన్‌డీఆర్ఎఫ్‌ బృందాలు ర‌క్షించాయి. బోట్ల సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈసంద‌ర్భంగా హ‌న్మ‌కొండ క‌లెక్ట‌ర్ స్నేహ శ‌బరీష్ స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. సుబేదారి ఇన్స్పెక్టర్ ఎం రంజిత్ కుమార్, కాజీపేట త‌హ‌సీల్దార్ భావ్‌సింగ్ విద్యార్థినుల‌కు అల్పాహారం, తాగునీరు అందించారు. అదేవిధంగా వ‌రంగ‌ల్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో పోలీసులు వేగంగా స్పందించి బాధితుల‌కు అండ‌గా నిల‌చారు. వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న వాళ్ల‌ను స్వ‌యంగా ర‌క్షించి మాన‌వ‌త్వం చాటుకున్నారు.

ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీపీ

తుఫాన్ దాటికి అత‌లాకుత‌ల‌మైన హనుమకొండ నగరంలోని ముంపు ప్రాంతాల‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించారు. ఈ సందర్భంగా పలు కాలనీలలో గృహ నిర్బంధమైన ప్రజల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే స్పందించాలని అధికారుల‌ను ఆదేశించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img