బ్యాడ్మింటన్లో వరంగల్ ఏసీపీల జోడీకి స్వర్ణం..
కాకతీయ, హనుమకొండ :సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా నిర్వహిస్తున్న 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్లో వరంగల్ కమిషనరేట్ అధికారులు ప్రతిభ చాటారు. 55 ఏళ్ల గెజిటెడ్ అధికారుల బ్యాడ్మింటన్ విభాగంలో వరంగల్కు చెందిన ఏసీపీలు జితేందర్ రెడ్డి, మధుసూదన్ జోడీ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని సాధించింది. పోటీల్లో ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన ఈ జోడీ కోర్టులో సమన్వయంతో, పదునైన ఆటతీరుతో ప్రత్యర్థులను వరుసగా ఓడిస్తూ ఫైనల్కు చేరుకుంది. తుది పోటీలోనూ అదే జోష్ కొనసాగించి విజయం సాధించి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. వరంగల్ కమిషనరేట్కు ఈ విజయం గర్వకారణంగా నిలిచింది. సహచర అధికారులు, సిబ్బంది విజేతలకు అభినందనలు తెలిపారు.


