epaper
Saturday, November 15, 2025
epaper

బిహార్ ఓటర్ జాబితాలో బంగ్లాదేశ్, అఫ్టాన్ వాసుల పేర్లు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: దేశ రాజకీయాల్లో ప్రస్తుతం బిహార్ ఎన్నికలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయకూడదని ఈసీ విపక్షాలను హెచ్చరిస్తోంది. ఈసీ చేస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో బిహార్ ఓటర్ల జాబితాలో అనేక మంది బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, అఫ్ఘానిస్తాన్ దేశాలకు చెందినవారి పేర్లు ఉన్నట్లు వెల్లడయ్యింది. ఈ దేశాలకు చెందిన అనేక మంది ప్రస్తుతం రాష్ట్రంలో నివాసం ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా కూడా ఆధార్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డులు వంటి వాటిని అక్రమ మార్గాల ద్వారా పొందినట్లు తెలుస్తోంది.

ఇలా అవకతవకలకు పాల్పడిన దాదాపు 3లక్షల మంది ఓటర్లకు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. వీటిపై ఆగస్టు 1 నుంచి పరిశీలన మొదలైందని..ఇది సెప్టెంబర్ నెలాఖరు వరకు కొనసాగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత అనర్హులను జాబితా నుంచి తొలగిస్తామని వెల్లడించాయి. ఓటర్ల జాబితాలో మార్పులు కోరుతూ గురువారం నాటికి లక్షా 95వేల దరఖాస్తులు అందిస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. వీటిలో 24, 991 దరఖాస్తులకు సంబంధించిన సమస్యలను ఇప్పటికే పరిష్కరించినట్లు వెల్లడించింది.

అఫ్టానిస్తాన్ కు చెందిన ఇమ్రాన్ ఖానమ్ అలియాస్ ఇమ్రానా ఖాటూన్, ఫిర్దోషియా ఖానమ్ అనే ఇద్దరు మహిళలకు కూడా బీహార్ లో ఓటరు కార్డులు జారీ అయినట్లు గుర్తించామని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ విషయంపై విచారణ జరపాలని కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. అనర్హులు, ఫేక్ ఓటర్లతోపాటు విదేశీయులను ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే లక్ష్యంగా ఈ సర్వే ప్రారంభించినట్లు ఎన్నికల సంఘం చెబుతోంది. ఇలాంటి సర్వేను చివరిసారిగా 20సంవత్సరాల క్రితం చేశారు. అప్పటి నుంచి అనుబంధ సవరణలు మాత్రమే చేపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను చేపట్టడంపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి.

ముస్లింలు, వలస కార్మికులు, దళితులను ఓటర్ల జాబితా నుంచి మినహాయించేందుకే కేంద్రం చెప్పినట్లు ఈసీ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోందని కాంగ్రెస్ నేత్రుత్వంలోని ఇండియా బ్లాక్ ఆరోపిస్తుంది. ఈ విషయంపై అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే స్వచ్చంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈసీ చర్యను ధర్మాసనం సమర్థించింది. ఇది రాజ్యాంగం ప్రకారం జరుగుతున్న ప్రక్రియ అని పేర్కొంది. అయితే ఎన్నికల సంఘం ఎంచుకున్న సమయాన్ని మాత్రం ప్రశ్నించింది.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీహార్‌లో ఎన్డీఏ క్లియర్ విక్టరీ.. గెలుపు రహస్యాలివే..!

బీహార్‌లో ఎన్డీఏ క్లియర్ విక్టరీ.. గెలుపు రహస్యాలివే..! కాక‌తీయ‌, జాతీయం: బీహార్ అసెంబ్లీ...

పీకే ప్రాజెక్ట్ బీహార్‌లో క్రాష్..!

పీకే ప్రాజెక్ట్ బీహార్‌లో క్రాష్..! పీకే అంచనాలను తారుమారు చేసిన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్లలో...

డిసెంబర్ 6న ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు.. దేశం వ‌ణికేలా జైష్ కుట్ర!

డిసెంబర్ 6న ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు.. దేశం వ‌ణికేలా జైష్ కుట్ర! ఎర్రకోట...

ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌ గుట్టు రట్టు.. ఇమామ్ ఇర్ఫాన్ అరెస్ట్‌!

ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌ గుట్టు రట్టు.. ఇమామ్ ఇర్ఫాన్ అరెస్ట్‌! ఫరీదాబాద్ మాడ్యూల్...

ఢిల్లీ బ్లాస్ట్‌ కుట్రలో కొత్త మలుపు..

ఢిల్లీ బ్లాస్ట్‌ కుట్రలో కొత్త మలుపు..జనవరి 26న మరో దాడికి ప్లాన్..! దీపావళికే...

ఎన్‌డీఏదే బీహార్… మహాఘట్ బంధన్ పై దాదాపు 8.3 శాతం ఓట్ల ఆధిక్యం

ఎన్‌డీఏదే బీహార్ ప‌నిచేసిన ‘నిమో’ (నితీష్+మోదీ) ఫార్ములా ఎన్డీయే కూటమికి 46.2 శాతం ఓట్లు మహాఘట్...

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్!

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్! కాక‌తీయ‌, జాతీయం : దేశ...

ఢిల్లీ: ఆ భ‌య‌మే బాంబ్ బ్లాస్ట్‌కు కార‌ణ‌మా?

ఢిల్లీ: ఆ భ‌య‌మే బాంబ్ బ్లాస్ట్‌కు కార‌ణ‌మా? కాక‌తీయ‌, జాతీయం : దేశ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img