epaper
Thursday, January 15, 2026
epaper

ప‌తాక స్థాయికి పల్లె పోరు

ప‌తాక స్థాయికి పల్లె పోరు
ఓటుకు రూ. 2 వేలు !.. సుక్కా.. ముక్కా అద‌నం
ప్రత్యర్థులు ఎంతిస్తే అంతకు మించి పంపిణీ
పోల్​ మేనేజ్​మెంట్​పై పార్టీలు బ‌ల‌ప‌ర్చిన అభ్య‌ర్థుల‌ దృష్టి
వార్డుల వారీగా అత్యంత స‌న్నిహితుల‌కు బాధ్య‌త‌లు
తొలి దశ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు సర్వం సిద్ధం
రేప‌టి ఉద‌యం 7 గంట‌ల నుంచి ఒంటి గంట వ‌ర‌కు పోలింగ్‌
మ‌ధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు.. ఫ‌లితాల వెల్ల‌డి
మొత్తం 3836 సర్పంచ్ స్థానాలు… 56,19,430 మంది ఓటర్లు
ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు : ఈసీ

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: పల్లె పోరు ప‌తాక‌స్థాయికి చేరింది. పోలింగ్‌కు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాల పర్వానికి తెర తీశారు.ప్రధాన పార్టీల అభ్యర్థులు. వార్డులు, కాలనీలవారీగా బాధ్యులను నియమించి మ‌ద్యం, మ‌నీ పంపిణీ ముమ్మరం చేశారు. ప్రత్యర్ధులు ఎంత ఇస్తే అంతకు మించి పంపిణీ చేస్తున్నారు. పోలీసులు తనిఖీలు చేస్తున్నా కళ్ళు కప్పి గుట్టుచప్పుడు కాకుండా ఈ తతంగం కొనసాగుతోంది. ఈ ఎన్నికలో ప్రతీ ఓటు కీలకం కావ‌డంతో అభ్యర్థులు అత్యధిక మంది మద్దతు కూడగట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజికవర్గాలు, మహిళా, యువ సంఘాలు, వలస ఓటర్ల వారీగా వారి బలాలను లెక్కగట్టుకుంటున్నారు. వారిని ఆకట్టుకునేలా ఎర వేస్తున్నారు. చాలాచోట్ల ఆన్​లైన్​ యాప్​లలో ఓటుకు ఇంత అని డబ్బు పంపిణీ చేస్తున్నారు. పోటీ గట్టిగా ఉన్న చోట ఓటుకు రూ.2000 నుంచి రూ.2500 వరకు ఇస్తున్నారు. అలాగే కొన్నిచోట్ల దీని డిమాండ్​ భారీగా పెరిగింది. ఒక కుటుంబంలో ఉన్న ఓట్ల ఆధారంగా రూ.4 నుంచి రూ.5 వేల వరకు పంపిస్తున్నారు. దీనికి తోడు ఇంటింటికీ చికెన్‌.. మ‌ద్యం బాటిళ్లు పంపుతుండ‌టంతో సుక్కా.. ముక్క‌తో గ్రామాలు ఊగిపోతున్నాయి.

ఆన్​లైన్​లో ఖాతాలకు మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్‌

గ్రామ పంచాయతీ తొలి దశ ఎన్నికల ప్రచారం మంగ‌ళ‌వారం ముగియడంతో అభ్యర్థులు పోల్​ మేనేజ్​మెంట్​పై దృష్టి సారించారు. నగదు, ఇంటింటికీ మద్యం సీసాల పంపిణీని ప్రారంభించారు. నగరాలు, పట్టణాల్లో ఉండే ఓటర్లకు పలువురు సర్పంచి అభ్యర్థులు వాహన ఏర్పాట్లు, ప్రయాణ ఖర్చులతోపాటు ఓటుకు డబ్బులను ఆన్​లైన్​లో వారి ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో మంగళవారం రాత్రే నుంచే డబ్బు పంపిణీ మొదలైంది. మేజర్​ గ్రామ పంచాయతీల్లో అభ్యర్థుల ప్రచార ఖర్చు, పంపిణీ మొత్తాలను కలిపితే రూ.కోటి వరకు చేరుకుంటోంది. నగరాలు, పట్టణాలకు సమీపంలో, భూముల ధరలు భారీగా ఉన్న చోట్ల ఈ ఖర్చు మరింత ఎక్కువగా ఉంటోంది. మొదటి దశ ఎన్నిక‌లు జ‌రిగే పంచాయతీల్లో ఈసీ నిబంధనల ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచే వైన్​షాపులు మూతపడ్డాయి. 12వ తేదీ వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది. సర్పంచ్‌, వార్డు సభ్యుల అభ్యర్థులు ముందే భారీఎత్తున మద్యం కొనుగోలు చేసి గ్రామాల్లో డంప్​లు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఓటర్లకు ఇంట్లో ఇద్దరు ఉంటే హాఫ్​ బాటిల్​, అదే నలుగురు ఉంటే ఫుల్​ బాటిల్​ ఇస్తున్నారు.

విధుల్లో ల‌క్ష‌మంది సిబ్బంది

తెలంగాణలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనున్నాయని.. ఈ నేపథ్యంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రాణి కుముదిని సూచించారు. గురువారం హైదరాబాద్‌లో ఎస్ఈసీ రాణి కుముదిని విలేకర్లతో మాట్లాడుతూ.. గురువారం ఉదయం 7 గంటల నుంచి ఈ పోలింగ్ ప్రారంభమవుతుందన్నారు. తొలి దశలో 56,19,430 మంది ఓటర్లు.. తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని చెప్పారు. 3836 సర్పంచ్ స్థానాలకు మొత్తం 13,127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లతో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల విధుల్లో లక్ష మందికి పైగా సిబ్బంది పాల్గొనున్నారని వివరించారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు 18 రకాల ఐడీ కార్డులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏ రకమైన ఐడీ కార్డును పోలింగ్ బూత్ అధికారులకు చూపించిన ఓటు వేయవచ్చునన్నారు. మంగవారం నుంచి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వైన్ షాపులన్నీ మూసి వేసినట్లు చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు మేజిస్ట్రియల్ పవర్స్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్ఈసీ వివరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img