అభివృద్ధి పనులపై గ్రామ పాలక మండలి సమీక్ష
కాకతీయ, ఇనుగుర్తి : మండలంలోని లాలు తండా గ్రామపంచాయతీ కి చెందిన గ్రామ అభివృద్ధి పనులపై నూతన పాలకమండలి శుక్రవారం సమీక్ష నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ భూక్య లక్ష్మీ వెంకన్న నాయక్ మాట్లాడుతూ గ్రామంలో వేసవికాలంలో ప్రతి ఇంటికి నీరు చేరేలా చర్యలు తీసుకునే విధంగా వాటికి సంబంధించిన బోర్లు తదితర అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు కలసి అంగన్వాడి సెంటర్ ను తనిఖీ నిర్వహించారు. అదేవిధంగా రైతులకు ఎస్సారెస్పీ నీళ్లు అందే విధంగా కాలువలో చెత్తాచెదారం పేరకపోవడంతో తమ దృష్టికి తీసుకురావడంతో ఎస్సారెస్పీ కాలువలను ఏమీ అడ్డు లేకుండా జెసిపి యంత్రంతో తీపించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రజిత రాజు, వార్డు సభ్యులు భూక్య జీవన్ తదితరులు పాల్గొన్నారు.


