బాధితులకు సత్వర న్యాయం చేయాలి
గ్రీవెన్స్ డేలో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ
కాకతీయ, జగిత్యాల టౌన్: ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో జిల్లా పోలీస్ కార్యాలయంలో 14 మంది అర్జీదారుల దరఖాస్తులను ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా స్వీకరించారు. వారి సమస్యలను వివరంగా విని, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు


