epaper
Saturday, November 15, 2025
epaper

వందేమాతరం స్ఫూర్తిమంత్రం

వందేమాతరం స్ఫూర్తిమంత్రం

భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుంది

జాతీయతా భావనలను పెంపొందించింది

ప్రధాని నరేంద్ర మోదీ

ఘ‌నంగా వందేమాతర గేయం 150 ఏళ్ల స్మారకోత్సవం

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : వందేమాతర గీతం ఒక స్వప్నం, ఒక సంకల్పం, అదొక స్ఫూర్తి మంత్రమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం దిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో వందేమాతర గేయం 150 ఏళ్ల స్మారకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించగా ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. వందేమాతరం గీతం అనేది దేశమాత ఆరాధన, సాధన అని ప్రధాని మోదీ అన్నారు. ఈ జాతీయ గేయం అందరినీ పురాణ ఇతిహాసాల్లోకి తీసుకెళ్తుందని, ఆ శబ్దం అందరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందని, వందేమాతరం సామూహిక గీతాలాపన ఒక అద్భుత అనుభవమన్నారు.

ఒకే లయ, స్వరం, భావంతో ..

ఒకే లయ, స్వరం, భావంతో గీతాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుందని, వందేమాతరం స్మారకోత్సవాలు దేశ ప్రజలకు ప్రేరణ ఇస్తాయన్నారు. ప్రతి గీతానికి ఒక మూల భావం, సందేశం ఉంటాయని, వందేమాతరం మూల భావం భారత్‌ అని మోదీ చెప్పారు. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి వందేమాతరం స్ఫూర్తిని అందించిందని తెలిపారు. దేశంలో జాతీయ ఐక్యతను, జాతీయతా భావనలను పెంపొందించడంలో అది కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ ఏడాది నవంబరు 7 నుంచి 2026 సంవత్సరం నవంబరు 7 వరకు దేశవ్యాప్తంగా ‘వందేమాతరం’ స్మారకోత్సవాలు ఘనంగా జరుగుతాయని ప్రధాని వెల్లడించారు. ‘వందేమాతరం’ 150 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా స్మారక స్టాంపు, నాణెంను ఆయన విడుదల చేశారు.

సంకల్పిస్తే సాధించలేనిది లేదు

‘‘వందేమాతర గేయంలోని పదాలు మనల్ని చరిత్ర పుటల్లోకి తీసుకెళ్తాయి. అవి మన వర్తమానాన్ని కొత్త విశ్వాసంతో నింపుతాయి. మన భవిష్యత్తుకు భరోసాను ఇస్తాయి. సంకల్పిస్తే సాధించలేని లక్ష్యమంటూ ఏదీ ఉండదనే ధైర్యాన్ని భారతీయులకు వందేమాతరం ప్రసాదిస్తుంది. నవంబరు 7 ఒక చారిత్రక దినోత్సవం. ఎందుకంటే మనం వందేమాతరం 150 ఏళ్ల స్మారకోత్సవాలను ఈరోజే ప్రారంభిస్తున్నాం. దీనికి సంబంధించి నిర్వహించబోయే కార్యక్రమాలు కోట్లాది మంది భారతీయుల్లో కొత్త శక్తిని నింపుతాయి. ఈ గొప్ప సందర్భాన్ని పురస్కరించుకొని నా తరఫున ప్రతీ భారతీయుడికి శుభాకాంక్షలు. వందేమాతర గేయంలోని ఆశయాల సాధన కోసం ప్రాణాలను త్యాగం చేసిన లక్షలాది మంది స్వాతంత్య్ర పోరాట యోధులకు నా శ్రద్ధాంజలి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

‘వందేమాతరం’ ఆలపించిన ప్రధాని

ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా సభికులతో కలిసి ప్రధాని మోదీ ‘వందేమాతరం’ పూర్తి గేయాన్ని ఆలపించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా, దిల్లీ సీఎం రేఖా గుప్తా తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కారు వందేమాతరం 150 ఏళ్ల స్మారకోత్సవాలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కార్యక్రమాల్లోనూ ‘వందేమాతరం’ పూర్తి గేయాన్ని ఆలపించనున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించనున్న ఈ వేడుకల్లో యువతను పెద్దసంఖ్యలో భాగం చేయనున్నారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంపై వందేమాతర గేయం ప్రభావాన్ని ప్రజలకు తెలియజేయనున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రతి అమెరికన్‌కి 2వేల డాల‌ర్లు..

ప్రతి అమెరికన్‌కి 2వేల డాల‌ర్లు.. ట్రంప్‌ బ్లాస్టింగ్‌ అనౌన్స్‌మెంట్‌! కాక‌తీయ‌, అంతర్జాతీయం : అమెరికా...

ట్రిలియ‌న్ డాల‌ర్ల ప్యాకేజీ

ట్రిలియ‌న్ డాల‌ర్ల ప్యాకేజీ ఎల‌న్ మ‌స్క్‌కు టెస్లా బోర్డు బంపర్ గిఫ్ట్ కార్పొరేట్ చరిత్రలో...

ఎన్డీఏ కూటమిదే ఘ‌న విజ‌యం

ఎన్డీఏ కూటమిదే ఘ‌న విజ‌యం నక్సల్​ రహిత భారత్ వైపు అడుగులు లాలూ, సోనియాకు...

ఇండియ‌న్ స్టూడెంట్స్‌కు కెన‌డా షాక్‌..!

ఇండియ‌న్ స్టూడెంట్స్‌కు కెన‌డా షాక్‌..! (కాక‌తీయ‌, అంతర్జాతీయం): కెనడా ఒకప్పుడు భారత విద్యార్థుల...

Viral Video: ఐక్యరాజ్యసమితిలో హార్ట్-టచ్ చేసిన ముస్లిం లీడర్ .. ‘ఓం శాంతి’ అంటూ సందేశం..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఐక్యరాజ్యసమితిలో చేసిన...

Trump: ట్రంప్ తిక్కకుదిరింది.. విదేశీ ఉద్యోగులను నియమించాలని ఆర్డర్..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: అమెరికా పరిశ్రమల్లో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని...

భారత్ పై ఆంక్షలు సరైన నిర్ణయమే.. జెలెన్ స్కీ హాట్ కామెంట్స్..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భారత్ పై...

ఆ యుద్ధాన్ని ఆపడం చాలా సులభం అనుకున్నా: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

కాకతీయ, నేషనల్ డెస్క్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img