epaper
Tuesday, March 10, 2026
epaper

గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

 గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

కలెక్టర్ గరిమ అగ్రవాల్

చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో పశువులకు టీకాల పంపిణీ

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక పనుల పరిశీలన

కాకతీయ సిరిసిల్ల టౌన్: పశువుల సంరక్షణకు పెంపకందారులు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పకుండా వేయించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆద్వర్యంలో పాల కేంద్రం ఆవరణలో మంగళవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా కలెక్టర్ గరిమ అగ్రావాల్ హాజరై ప్రారంభించారు. పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు.పాల కేంద్రాన్ని పరిశీలించి గ్రామంలో ఎన్ని పాడి పశువులు ఉన్నాయి? ఎన్ని లీటర్ల పాలు వస్తాయి? ఎక్కడ విక్రయిస్తారు అనే వివరాలను పాల కేంద్రం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.అలాగే ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా గ్రామంలో కొనసాగుతున్న పనులపై ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు చేశారు.రోగాల బారిన పడిన పాడి పశువులు పాలు తక్కువ ఇస్తాయని వివరించారు. పాలు, పాల ఎగుమతుల పై ఆ ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. పెంపకందారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు. పెంపకందారులు తమ జీవాల ఆరోగ్య సంరక్షణ, ఆర్థికంగా నష్ట పోకూడదనే ఉద్దేశంతో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రభుత్వం ఉచితంగా వేయిస్తుందని పేర్కొన్నారు. పెంపకందారులు ముందస్తుగా టీకాలు వేయించి ఆ రోగాల బారి నుంచి తమ జీవాలను రక్షించాలని సూచించారు.

అన్ని పాడి పశువులు, ఎద్దులు, దూడలకు పశువుల పెంపకందారులు, రైతులు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని, జిల్లాలో 97 వేల జీవాలు ఉన్నాయని, పశు వైద్య డాక్టర్లు, సిబ్బంది 26 టీమ్ లుగా ఏర్పడి వచ్చే నెల ఏప్రిల్ 9వ తేదీ వరకు టీకాలు వేస్తారని తెలిపారు.
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో జిల్లాలోని అన్ని గ్రామాలు, రెండు మున్సిపాలిటీల్లో పారిశుధ్య పనులు చేపడుతున్నారని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ ఆద్వర్యంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసి గృహ ప్రవేశానికి సిద్దం చేయాలని ఆదేశించారు. మహిళా సమాఖ్య భవనాల నిర్మాణ పనులు వేగంగా పనులు చేపట్టి జూన్ 2వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. యూత్ అండ్ స్పోర్ట్స్ ఆధికారి ఆద్వర్యంలో యువతకు 5కే రన్, ఉపాధి కల్పన శాఖ ఆద్వర్యంలో జాబు మేళాలు చేపడుతారని కలెక్టర్ తెలిపారు. వ్యవ సాయ, విద్యాశాఖ, అటవీ శాఖ, డీఆర్డీఓ వివిధ శాఖల ఆద్వర్యంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా చేపడుతున్న పనుల్లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

గాలికుంటు వ్యాధి బారిన పడిన జీవాల శరీర ఉష్ణోగ్రత 104º F – 1060 F పెరిగి పశువులు నీరసించి పోతాయని, పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని, వాటి నోరు అలాగే గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడి, 24 గంటల్లో చితికిపోయి పొక్కులు, పుండ్లుగా మారి నొప్పి వలన పశువులు మేత నీరు తీసుకోక నీరసించి చనిపోయే ప్రమాదం ఉందని పశు వైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. పశువుల పాకలను శుభ్రంగా ఉండాలని సూచించారు. టీకాలు వేసి గుర్తింపు కొరకు చెవి పోగు వేయించి ఆ వివరాలు భారత్ పశుధాన్ యాప్ లో నమోదు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దూది మనీషా, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఎంపీడీఓ రాధ, పశు వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఊరి కోసం శ్రామికుడిగా పనిచేస్తా

ఊరి కోసం శ్రామికుడిగా పనిచేస్తా తాగునీరు పారిశుధ్యం పై దృష్టి సారిస్తా రేగళ్ల...

ఇక ఉపేక్షించేది లేదు

ఇక ఉపేక్షించేది లేదు కలుషిత ఆహార ఘటనలపై కలెక్టర్ అంకిత్ సీరియ‌స్‌ పున‌రావృతం కాకుండా...

డ్రైనేజీలను పరిశీలించిన మేయర్..!

డ్రైనేజీలను పరిశీలించిన మేయర్..! శుభ్రత పనులు చేపట్టిన కార్పొరేటర్లు కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం...

కారేపల్లిలో పారిశుద్ధ్య పనులు

కారేపల్లిలో పారిశుద్ధ్య పనులు కాకతీయ, కారేపల్లి: మండలంలో ప్రజా పాలన తొంభై తొమ్మిది...

సొసైటీ అప్పు పేరుతో రైతులకు వేధింపులు

సొసైటీ అప్పు పేరుతో రైతులకు వేధింపులు గోల్డ్ లోన్ రెన్యువల్ కోసం వచ్చిన...

స్టేడియంలో సింథటిక్ ట్రాక్

స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఫ‌లించిన మంత్రి తుమ్మల కృషి రూ.8.50 కోట్లతో నిర్మాణం.. శరవేగంగా...

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారించాలి

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారించాలి ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించాలి అర్హులకు న్యాయం జరిగేలా బాధ్యతగా...

పోడు భూమిలో కందకాలు..

పోడు భూముల్లో కందకాలు మనస్థాపంతో రైతు ఆత్మహత్యాయత్నం తిప్పగుట్టలో ఉద్రిక్త పరిస్థితి.. అటవీ శాఖ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img