అకాల వర్షం-అన్నదాతకు తీవ్ర నష్టం
ఈదురు గాలులతో నేలకొరిగిన మక్కజొన్న పంట
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి-చెల్పూరి రాము
కాకతీయ, జమ్మికుంట: తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెల్పూరి రాము. మంగళవారం రోజున ఇల్లంతకుంట మండలం ఇల్లంతకుంట, బూజునూరు, చిన్న కోమటిపల్లి, సిరిసేడు, టేకుర్తి గ్రామాలలో ఈదురు గాలులతో నేలకొరిగిన మక్కజొన్న పంటలను పరిశీలించి అనంతరం తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెల్పురి రాము. మాట్లాడుతూ ఇల్లంతకుంటలో సోమవారం సాయంత్రం విపరీతమైన ఈదురు గాలుల విచ్చడం వల్ల సుమారు మూడు వందల యాభై ఎకరాల వరకు మక్కజొన్న పంట నేలకొరిగింది. యాసంగి పంట వేసుకున్న మక్కజొన్న పిసు దశ వచ్చేసరికి మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు ఈదురుగాలుల వల్ల మక్కజొన్న పంట నేలకొరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యవసాయ శాఖ ద్వారా సమాచారం తెలుసుకొని నెలకొరిగిన మొక్కజొన్న పంటలను వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోయిన రైతులకి ప్రభుత్వం నుండి ఎకరానికి యాభై వేల రూపాయల నష్టపరిహారం ఇప్పించాలని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఈదురు గాలులతో వేల ఎకరాల పంట పొలాలు నష్టపోవడం వలన రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం అనావృష్టి వలన నష్టపోయిన పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమమే ధ్యేయంగా చెప్పుకుంటూ అనేక హామీలు ఇస్తున్నారని కానీ ఆచరణలో రైతును ఆదుకునే పరిస్థితి లేదన్నారు ప్రతి సంవత్సరం బడ్జెట్లో అకాల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఫసల్ బీమా చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల పంట పొలాలు నష్టపోయిన రైతులందరి తో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కమిటీ సభ్యులు చింతల కౌశిక్, వెంకట్రాజ్యం, లచ్చయ్య, వెంకటయ్య, పాల్గొన్నారు.


