epaper
Thursday, January 15, 2026
epaper

మేడారంలో కనిపించని పారిశుద్ధ్యం!

మేడారంలో కనిపించని పారిశుద్ధ్యం!
ఆలయం పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త కుప్పలు
ప్లాస్టిక్, జంతు అవశేషాలతో దుర్వాసన
ముందస్తు భక్తుల రాకతో పెరిగిన అవస్థలు
పారిశుద్ధ్య యంత్రాంగంపై భక్తుల ఆగ్రహం

కాకతీయ, ములుగు ప్రతినిధి : ఏటా లక్షలాది భక్తులను ఆకర్షించే ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఈనెల 28 నుంచి 31 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. జాతరకు ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉండగానే ముందస్తుగా లక్షల సంఖ్యలో భక్తులు మేడారానికి తరలివస్తుండగా… పారిశుద్ధ్య వ్యవస్థ మాత్రం ఎక్కడా కనిపించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మేడారం ఆలయం పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, గాజు సీసాలు, ఆహార అవశేషాలు, జంతు వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ పేరుకుపోయాయి. రహదారుల పక్కన చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఈ వ్యర్థాలు కుళ్లిపోవడంతో తీవ్రమైన దుర్వాసన వ్యాపిస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తున్నప్పటికీ చెత్త తొలగింపు మాత్రం రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే జరుగుతోందని ఆరోపిస్తున్నారు.

కనిపించని పారిశుద్ధ్య యంత్రాంగం

జాతరకు ఇంకా సమయం ఉండగానే పరిస్థితి ఇలా ఉంటే… అసలు జాతర రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయం చుట్టూ, భక్తులు బస చేసే ప్రాంతాల్లో చెత్త తొలగింపు, మురుగు కాలువల శుభ్రత, ప్లాస్టిక్ నియంత్రణ చర్యలు ఎక్కడా కనిపించడం లేదని విమర్శిస్తున్నారు. వ్యర్థాలను పూర్తిగా తొలగించకుండా కేవలం బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ పైపై పనులు చేయడం వల్ల మరింత దుర్గంధం వ్యాపిస్తోందని భక్తులు మండిపడుతున్నారు. మేడారం జాతరలో మొక్కులు తీర్చుకునే భాగంగా కోళ్లు, మేకలు బలి ఇచ్చే ఆచారం ఉంది. అయితే బలి అనంతరం జంతు అవశేషాలను సకాలంలో తొలగించకపోవడంతో అవి ప్రదేశం అంతా చెదురుమదురుగా పడిపోతున్నాయి. రెండు మూడు రోజులు అలాగే ఉండిపోతున్న ఈ కళేబరాల వల్ల దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెదురు ఈగలు, దోమలు పెరిగి అంటువ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతరకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న అధికారులు… భక్తులకు అత్యంత ప్రాథమికమైన పారిశుద్ధ్యాన్ని మాత్రం విస్మరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్యను పెంచడం, రోజువారీ చెత్త సేకరణ, ప్రత్యేక సానిటేషన్ బృందాల ఏర్పాటు, ప్లాస్టిక్ నిషేధంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీ నేతల విమర్శ

మేడారం పరిసరాలు దుర్గంధం వెదజల్లుతున్నాయని బీజేపీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. ముందస్తు భక్తులకు అనుగుణంగా పారిశుద్ధ్య పనులు జరగటం లేదని, ఎక్కడ చూసినా వ్యర్థాలు కుళ్లిపోయి చెడు వాసన వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు కలగజేసుకుని ప్రత్యేక పారిశుద్ధ్య వ్యవస్థను ఏర్పాటు చేసి వ్యర్థాలను తొలగించి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img