పస్రాలో డాగ్ స్క్వాడ్తో ఆకస్మిక తనిఖీలు
అక్రమ మత్తు పదార్థాలపై కట్టుదిట్టమైన నిఘా
ఎస్ఐ తాజుద్దీన్
కాకతీయ, ములుగు ప్రతినిధి: యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటం పోలీసుల ప్రధాన బాధ్యత అని ఎస్ఐ తాజుద్దీన్ తెలిపారు. అక్రమ మత్తు పదార్థాల విక్రయం, రవాణా, నిల్వలను అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తామని చెప్పారు. ములుగు జిల్లా గోవింద్రావుపేట మండలం పసర కేంద్రంలో సీఐ దయాకర్ పర్యవేక్షణలో ఎస్ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో నార్కోటిక్స్ డాగ్ స్క్వాడ్తో కలిసి విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించారు. కిరాణా దుకాణాలు, మెడికల్ షాపులు, ఇతర వ్యాపార సంస్థల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నార్కోటిక్స్ డాగ్ సహాయంతో ప్రతి దుకాణాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎక్కడైనా మత్తు పదార్థాల నిల్వలు ఉన్నాయా అనే దానిపై దృష్టి సారించారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


