epaper
Thursday, January 15, 2026
epaper

బ్రిటన్‌లో జాత్యహంకారం.. 20 ఏళ్ల సిక్కు యువతిపై అత్యాచారం..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: బ్రిటన్‌లో భారత సంతతి ప్రజలపై జాత్యహంకార దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, ఓల్డ్‌బరీ పట్టణంలో 20 ఏళ్ల సిక్కు యువతి అత్యాచారానికి గురైన ఘటన వెలుగులోకి రావడంతో అక్కడి భారతీయ సమాజం ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇద్దరు శ్వేతజాతీయ దుండగులు యువతిపై దాడి చేసి, జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ మీ దేశానికి తిరిగి వెళ్లిపో అని అరిచినట్లు తెలుస్తోంది. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ సంఘటన గత మంగళవారం ఉదయం 8:30 గంటల సమయంలో టేమ్ రోడ్ సమీపంలో జరిగింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు దీనిని సాధారణ నేరంగా కాకుండా జాత్యహంకార ప్రేరేపిత దాడిగా నమోదు చేశారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలించి నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒకరు ముదురు రంగు స్వెట్‌షర్ట్, మరొకరు గ్రే కలర్ టాప్ ధరించి ఉన్నారని గుర్తించారు.

ఈ ఘటనపై స్థానిక సిక్కు సమాజం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సంఘటన తర్వాత ఆ ప్రాంతంలో అదనపు పోలీస్ బలగాలను మోహరించి, పెట్రోలింగ్‌ను పెంచుతామని అధికారులు హామీ ఇచ్చారు. “సమాజంలో భయం పుట్టకుండా మేము కఠిన చర్యలు తీసుకుంటాము” అని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

భారత సంతతికి చెందిన బ్రిటన్ ఎంపీలు కూడా ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. బర్మింగ్‌హామ్ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ మాట్లాడుతూ.. ఇది కేవలం హింస కాదు, మానవత్వంపై మచ్చ. బాధితురాలు ఈ దేశానికి చెందనట్టు దుండగులు అన్నా, ఆమె కూడా ఈ నేలదే. ప్రతి ఒక్కరికీ గౌరవంగా, సురక్షితంగా జీవించే హక్కు ఉంది. బ్రిటన్‌లో జాత్యహంకారానికి స్థానం లేదు” అని పేర్కొన్నారు.

మరో ఎంపీ జస్ అత్వాల్ ఈ ఘటనను హేయమైన, స్త్రీ ద్వేషపూరిత దాడి”గా అభివర్ణించారు. దేశంలో పెరుగుతున్న జాత్యహంకార ఉద్రిక్తతల వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ఈ అమానుష దాడి బాధితురాలికి జీవితాంతం మానసిక క్షోభ మిగులుస్తుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక నెల రోజుల క్రితం వోల్వర్‌హాంప్టన్‌లో ఇద్దరు వృద్ధ సిక్కులపై ముగ్గురు టీనేజర్లు దాడి చేసిన ఘటన మరవకముందే, మరోసారి సిక్కు సమాజం లక్ష్యంగా మారడం స్థానికులలో ఆందోళన రేపుతోంది. ఈ సంఘటనలపై యూకే ప్రభుత్వానికి కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ సమాజం డిమాండ్ చేస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

ఏవో.. యూరియా టోకెన్ల దందా

యూరియా టోకెన్ల దందా చెన్నారావుపేట‌లో బ‌య‌ట‌ప‌డిన ఏవో దందా సోషల్ మీడియాలో వైరల్ అయిన...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం ఫజల్‌ అలీ నుంచి విభజన వరకూ మోసాలు పాలమూరుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img