epaper
Monday, March 2, 2026
epaper

ట్రంప్ టారిఫ్ షాక్.. తెలుగు రైస్ ఇండస్ట్రీకి పెనుముప్పు సంకేతాలు!

ట్రంప్ టారిఫ్ షాక్.. తెలుగు రైస్ ఇండస్ట్రీకి పెనుముప్పు సంకేతాలు!
అమెరికన్ రైస్ ఇండస్ట్రీ ఫిర్యాదులు పెరగడంతో ట్రంప్ ఆగ్రహం
భారత్–చైనా–థాయిలాండ్ నుంచి తక్కువ ధర బియ్యం దిగుమతులే ప్రధాన సమస్య
భారత బియ్యంపై కఠిన చర్యల దిశ‌గా ట్రంప్ అడుగులు

కాక‌తీయ‌, ఇంట‌ర్నేష‌న‌ల్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ భారత బియ్యం ఎగుమతులపై కఠినంగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల వైట్ హౌస్‌లో అమెరికన్ రైస్ ఇండస్ట్రీ ప్రతినిధులతో ఆయన చేసిన సమావేశం పెద్ద చర్చకు దారితీసింది. ఈ సమావేశంలో అమెరికా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించిన అంశాలు ఇప్పుడు భారత్ రైస్ రంగానికే కాదు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రైస్ పరిశ్రమకు పెద్ద ఆందోళనగా మారాయి.

ఈ సమావేశంలో మెరీల్ కెనడీ అనే ప్రతినిధి ట్రంప్‌కు దక్షిణ అమెరికా రాష్ట్రాల్లో బియ్యం రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించారు. తక్కువ ధరలకు భారత్, చైనా, థాయిలాండ్ వంటి దేశాల నుంచి బియ్యం అమెరికా మార్కెట్లో పెద్ద ఎత్తున దిగుమతి అవుతోందని, దీని వల్ల స్థానిక రైతులు తీవ్ర నష్టంలోకి వెళ్లిపోతున్నారని తెలిపారు. పోర్టోరికో మార్కెట్‌లో కూడా అమెరికా బియ్యం స్థానాన్ని చైనా ఆక్రమించిందని ఆమె పేర్కొన్నది ఓ కీలక అంశం.

దీనిపై ట్రంప్ కూడా వెంటనే స్పందిస్తూ, “భారత్ వంటి దేశాలపై సుంకాలు పెంచితే సమస్య రెండు నిమిషాల్లో పరిష్కారం అవుతుంది” అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా అమెరికాలో బియ్యం డంపింగ్ చేస్తున్న దేశాల పూర్తి జాబితాను పంపించాలని ఆదేశించారు. ఈ వ్యాఖ్యలతో భారత బియ్యం ఎగుమతులపై కొత్త టారిఫ్‌లు పెరిగే ప్ర‌మాదం కనిపిస్తోంది.

ప్రతి సంవత్సరం భారత్ నుంచి అమెరికాకు సుమారు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అవుతోంది. దీని విలువ దాదాపు రూ. 3,000 కోట్లు. ఇందులో 60-70 శాతం బాస్మతి బియ్యం కాగా, మిగతా భాగం నాన్ బాస్మతి కేటగిరీకి చెందుతుంది. నాన్ బాస్మతి విభాగంలో ప్రధానంగా సోనామసూరి బియ్యం ఎగుమతవుతుంది, ఇది ఎక్కువ శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచే అమెరికాకు వెళుతుంది.

ప్రస్తుతం బాస్మతి పై సుంకాలు 0 నుంచి 2.5 శాతం మాత్రమే ఉండగా, నాన్ బాస్మతి బియ్యం పై సుమారు 15% సుంకం ఉంది. ఒకవేళ ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేకంగా భారత బియ్యం పై టారిఫ్‌లు పెంచితే ఈ సుంకం 25% నుండి 40% వరకు పెరిగే అవకాశముందని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక‌వేళ నిజంగా టారిఫ్‌లు పెరిగితే అమెరికాలో సోనామసూరి ధర భారీగా పెరుగుతుంది. దీంతో ప్రవాస భారతీయులు ప్రత్యేకించి దక్షిణ భారతీయులు తక్కువ ధరలో లభించే థాయిలాండ్ బియ్యం లేదా అమెరికన్ రైస్ కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఫ‌లితంగా తెలుగు రాష్ట్రాల రైస్ మిల్లర్లు, ఎగుమతిదారులు ఎదురుచూస్తున్న లాభాలు తగ్గిపోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త అవకాశాలు వెతుకునే పరిస్థితి రావచ్చు. మొత్తం మీద, ట్రంప్ ప్రభుత్వం తీసుకునే కొత్త సుంకాల నిర్ణయం భారత రైస్ ఎగుమతి రంగానికే కాకుండా, తెలుగు రాష్ట్రాల రైస్ పరిశ్రమపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. మ‌రి రాబోయే రోజుల్లో ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను ఏ దిశలో నడిపిస్తుందో చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img