epaper
Thursday, January 15, 2026
epaper

ఐనవోలు జాతరకు పటిష్ట ఏర్పాట్లు

ఐనవోలు జాతరకు పటిష్ట ఏర్పాట్లు
భక్తులకు ఎలాంటి అసౌకర్యం క‌ల‌గ‌కూడ‌దు
శాఖల సమన్వయంతో ప్రశాంతంగా జాతర నిర్వహించాలి
వైద్యం, విద్యుత్‌, రవాణా, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
అధికారుల‌కు మంత్రి కొండా సురేఖ ఆదేశాలు

కాక‌తీయ‌, హనుమకొండ : ఐనవోలు శ్రీ మల్లికార్జునస్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే జాతర ఏర్పాట్లపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

విద్యుత్‌, తాగునీరు, పారిశుధ్యానికి ప్రాధాన్యం

జాతర సందర్భంగా ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించాలని, ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటల విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. బస్టాండ్‌, జాతర ప్రాంగణంలో తాగునీటి సౌకర్యాలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పారిశుధ్య నిర్వహణ అత్యంత కీలకమని పేర్కొంటూ అవసరమైతే పక్క గ్రామాల సిబ్బందిని కూడా వినియోగించాలని సూచించారు. మొబైల్‌ టాయిలెట్లు ఏర్పాటు చేసి మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని చెప్పారు.

వైద్య సదుపాయాలు, అత్యవసర సేవలు

భక్తుల ఆరోగ్య పరిరక్షణకు జాతర ప్రాంగణంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, 108 అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. ప్రైవేట్‌ ఆసుపత్రులు కూడా స్వచ్ఛందంగా సేవలందించేలా వైద్య ఆరోగ్యశాఖ చొరవ తీసుకోవాలని సూచించారు. పారిశుధ్య సిబ్బందికి మాస్కులు, భోజనం, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.

రవాణా, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణ

జాతరకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలని, కొమురవెల్లి, మేడారం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సరైన పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, మహిళా భక్తుల భద్రత కోసం మహిళా పోలీసులను నియమించాలని మంత్రి సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అనుమానితులు, దొంగతనాలు జరగకుండా నిఘా పెంచాలని చెప్పారు. అక్రమ మద్యం అమ్మకాలను కట్టడి చేయాలని ఎక్సైజ్‌ శాఖకు ఆదేశాలు ఇచ్చారు.

సమన్వయంతో విజయవంతం చేయాలి

జాతర ఏర్పాట్లలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, విధుల్లో ఉన్న అధికారుల పనితీరును పర్యవేక్షించి ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. సమావేశం అనంతరం జాతర, పర్యాటక శాఖ పోస్టర్లను మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కలిసి ఆవిష్కరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img