epaper
Friday, January 16, 2026
epaper

అధికారుల నిఘాలోనే పులి

అధికారుల నిఘాలోనే పులి
ట్రాప్ కెమెరాలు, సిబ్బందితో పర్యవేక్షణ
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ములుగు డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, రేంజర్ డోలి శంకర్
కాకతీయ, ములుగు ప్రతినిధి: వారం రోజులుగా ములుగు జిల్లా పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్టు పాదముద్రలను స్థానికులు గుర్తిస్తున్నారు. జిల్లాలో పెద్దపులి మళ్లీ సంచరిస్తూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా పులి చలనం పలు గ్రామాల్లో కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బుధవారం పత్తిపల్లి గ్రామ శివారు పొలాల్లో పులి పాదముద్రలు గుర్తించిన గ్రామస్తులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న రేంజర్ డోలి శంకర్ పులి అడుగుజాడలను పరిశీలించి పత్తిపల్లి, చిన్న గుంటూరుపల్లి పరిసరాల్లో పులి సంచరిస్తోందని ధృవీకరించారు. స్థానికులు పులికి హాని తలపెట్టవద్దని, ఎలాంటి కదలికలు గమనించిన వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు. ఇప్పటికే పులి పాకాల రిజర్వ్ ఫారెస్ట్ నుండి పత్తిపల్లి ఎదల చెరువు, బుగ్గ చెరువు దాకా తిరుగుతూ కనిపించిందని గ్రామస్తులు చెబుతున్నారు. తరువాతి రోజుల్లో పులి పులిగుండం, జాకారం, సింగరకుంటపల్లి, తామరచెరువు మీదుగా నర్సాపూర్ పొలాలకు చేరిందని పాదముద్రలు ఆధారంగా అంచనా వేశారు. దీంతో ఫారెస్ట్ రేంజర్ డోలి శంకర్ ఆధ్వర్యంలో బీట్ ఆఫీసర్లు, బేస్ క్యాంప్ సిబ్బందితో 20 మంది ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి పులి కదలికలపై నిఘా పెంచారు. పులి రామప్ప చెరువు మీదుగా వానలగుట్ట చేరినట్టు అధికారులు గుర్తించారు. అక్కడ గాండ్రింపులు వినిపించడంతో పశువులు భయంతో గ్రామాల వైపు పరుగులు పెట్టాయని పశువుల కాపరులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పులి కదలికలను ట్రాప్ కెమెరాలు, మానవ వనరుల ద్వారా నిఘాలో ఉంచామని అధికారులు వెల్లడించారు. పులి రక్షణతో పాటు ప్రజల భద్రతకూ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పులి సహజ వాతావరణంలోనే సంచరిస్తోందని, దానికి ఎటువంటి హాని జరగకుండా చూడటం తమ బాధ్యత అని ఎటువంటి హాని జరగకుండా చూడటం మా బాధ్యత ములుగు ఫారెస్ట్ రేంజర్ డోలి శంకర్ అన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా కదలిక గమనించిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, ప్రత్యేక బృందంగా ఏర్పడి ఎప్పటికప్పుడు పులి సంచారాన్ని గమనిస్తుమని ఆయన తెలిపారు. ప్రత్యేక బృందంతో పులిని పర్యవేక్షిస్తున్నామని ములుగు డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. ములుగులో పెద్దపులి ప్రవేశించినప్పటి నుండి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి పులిని అనుసరిస్తుమని, ట్రాప్ కెమెరాలతో పులి పాదముద్రల ఆధారంగా పులి సంచరించే ప్రదేశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పులి భద్రతకు ప్రాధాన్యవిస్తూ స్థానికులు, పశువులు, పశువుల కాపరులను హెచ్చరిస్తూ పులి కదలికలను గమనిస్తూనే ఉన్నామని డీఎఫ్ఓ చెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img