epaper
Sunday, March 8, 2026
epaper

క్యాత‌న్‌ప‌ల్లి హస్తం పార్టీలో టికెట్ల కుంపటి

క్యాత‌న్‌ప‌ల్లి హస్తం పార్టీలో టికెట్ల కుంపటి
టికెట్లు అమ్ముకుంటున్నారంటూ మంత్రి ఎదుటే వాగ్వాదం
జెండా మోసిన నాయకులకు అన్యాయమంటూ ఆశావ‌హుల ఆరోప‌ణ‌లు
ర‌సాబాస‌గా మారిన మంత్రుల సమావేశం..! ఐదు నిముషాల్లో మీటింగ్ క్లోజ్‌
మంత్రి వివేక్ ఇలాఖాలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల వేఢీ
కాంగ్రెస్‌లో పెరుగుతున్న అస‌మ్మ‌తి నేత‌లు

కాకతీయ, రామకృష్ణాపూర్ : పట్టణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు రోజురోజుకూ మరింత ముదురుతున్నాయి. ఆశావహుల ఆశలను ఆవిరి చేస్తూ కొందరు నేతలు వివాదాలకు తెరలేపుతున్నారనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. హస్తం పార్టీలో టికెట్ల కుంపటి నేతల మధ్య తీవ్ర విభేదాలకు కారణమవుతోందని పార్టీ వర్గాలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నాయి. మున్సిపాలిటీలో వార్డుల వారిగా వెలువడిన రిజర్వేషన్లు ఒకవైపు ఉండగా, టికెట్ల కేటాయింపు మరో పెద్ద ఘట్టంగా మారింది. క్యాతన్ పల్లిలోని ఇరవై రెండు వార్డుల్లో ఎవరెవరికి టికెట్లు దక్కనున్నాయన్న అంశమే ఇప్పుడు ప్రతి నోట వినిపిస్తోంది. ఈ టికెట్ల కోసమే మంత్రుల సమావేశ మందిరంలోనే నేతలు ఒకరికొకరు సూటిగా ప్రశ్నించుకోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

మంత్రుల ముందే మాటల యుద్ధం..!

టికెట్ల వ్యవహారంపై పార్టీలోని నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకోవడంతో మంత్రుల సమావేశాన్ని ఐదు నిమిషాల్లోనే ముగించాల్సి వచ్చింది. ఎన్నికల వేళ సొంత పార్టీలోనే తలెత్తిన ఈ వివాదం పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ నేతల మధ్య జరిగిన ఈ సంఘటనపై “కాకతీయ” ప్రత్యేక కథనం అందిస్తోంది. సోమవారం స్థానిక బీమా గార్డెన్లో ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సమక్షంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ నాయకుల మధ్య తీవ్ర కలహాలు చోటుచేసుకున్నాయి. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డ వారికి కాకుండా కొత్త వారికి టికెట్లు అమ్ముకుంటున్నారని సీనియర్ నాయకుడు పుల్లూరి కల్యాణ్ ఆరోపించారు. తమకు నచ్చిన వారి పేర్లను అర్హుల జాబితాలో చేర్చి, పార్టీ కోసం కష్టపడ్డ వారి పేర్లను ఎందుకు పక్కన పెడుతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు.

గుర్తింపు లేదు… గౌరవం లేదు.!!

పార్టీ కోసం పనిచేసిన వారికి సరైన గుర్తింపు, గౌరవం, టికెట్లు దక్కడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వార్డుల్లో కార్యక్రమాలు నిర్వహించింది తానే అయినా, టికెట్లు మాత్రం ఇతరులకు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం మంత్రులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, పట్టణ నాయకులు, కార్యకర్తల ముందే జరగడం విశేషంగా మారింది. ఎన్నికల సమయంలో సొంత పార్టీలోనే తలెత్తిన ఈ నేతల కుంపటి కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి పెద్ద తలనొప్పిగా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంపై మంత్రి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. కాగా, నేతల మధ్య చోటుచేసుకున్న మాటల యుద్ధానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం బీఆర్ఎస్ హయాంలోనే సాగునీటి విప్లవం ఎల్లంపల్లి, మిడ్ మానేర్,...

క‌రీంన‌గ‌ర్‌ను ఆద‌ర్శంగా నిలుపుతాం..

క‌రీంన‌గ‌ర్‌ను ఆద‌ర్శంగా నిలుపుతాం.. మేయర్ కొలగాని శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి కాకతీయ, కరీంనగర్ కార్పొరేష‌న్...

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు కాకతీయ, రామగుండం : నగరంలో చేపట్టిన కాలువ పూడికతీత...

పొన్నం రవిచంద్రకు

పొన్నం రవిచంద్రకు గద్దర్ ఫిల్మ్ అవార్డు ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీగా ‘ద ఫస్ట్...

ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్

ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో శనివారం మున్సిపాలిటీ...

హామీల అమలుపై నిలదీయాలి

హామీల అమలుపై నిలదీయాలి బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ కాకతీయ, కరీంనగర్ :...

పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం

పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం కాకతీయ కరీంనగర్ : ‘ప్రజా పాలన –...

గురుకుల ఘటనపై చర్యలు తీసుకోవాలి

గురుకుల ఘటనపై చర్యలు తీసుకోవాలి కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లి మహాత్మా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img