epaper
Monday, January 19, 2026
epaper

క్యాత‌న్‌ప‌ల్లి హస్తం పార్టీలో టికెట్ల కుంపటి

క్యాత‌న్‌ప‌ల్లి హస్తం పార్టీలో టికెట్ల కుంపటి
టికెట్లు అమ్ముకుంటున్నారంటూ మంత్రి ఎదుటే వాగ్వాదం
జెండా మోసిన నాయకులకు అన్యాయమంటూ ఆశావ‌హుల ఆరోప‌ణ‌లు
ర‌సాబాస‌గా మారిన మంత్రుల సమావేశం..! ఐదు నిముషాల్లో మీటింగ్ క్లోజ్‌
మంత్రి వివేక్ ఇలాఖాలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల వేఢీ
కాంగ్రెస్‌లో పెరుగుతున్న అస‌మ్మ‌తి నేత‌లు

కాకతీయ, రామకృష్ణాపూర్ : పట్టణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు రోజురోజుకూ మరింత ముదురుతున్నాయి. ఆశావహుల ఆశలను ఆవిరి చేస్తూ కొందరు నేతలు వివాదాలకు తెరలేపుతున్నారనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. హస్తం పార్టీలో టికెట్ల కుంపటి నేతల మధ్య తీవ్ర విభేదాలకు కారణమవుతోందని పార్టీ వర్గాలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నాయి. మున్సిపాలిటీలో వార్డుల వారిగా వెలువడిన రిజర్వేషన్లు ఒకవైపు ఉండగా, టికెట్ల కేటాయింపు మరో పెద్ద ఘట్టంగా మారింది. క్యాతన్ పల్లిలోని ఇరవై రెండు వార్డుల్లో ఎవరెవరికి టికెట్లు దక్కనున్నాయన్న అంశమే ఇప్పుడు ప్రతి నోట వినిపిస్తోంది. ఈ టికెట్ల కోసమే మంత్రుల సమావేశ మందిరంలోనే నేతలు ఒకరికొకరు సూటిగా ప్రశ్నించుకోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

మంత్రుల ముందే మాటల యుద్ధం..!

టికెట్ల వ్యవహారంపై పార్టీలోని నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకోవడంతో మంత్రుల సమావేశాన్ని ఐదు నిమిషాల్లోనే ముగించాల్సి వచ్చింది. ఎన్నికల వేళ సొంత పార్టీలోనే తలెత్తిన ఈ వివాదం పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ నేతల మధ్య జరిగిన ఈ సంఘటనపై “కాకతీయ” ప్రత్యేక కథనం అందిస్తోంది. సోమవారం స్థానిక బీమా గార్డెన్లో ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సమక్షంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ నాయకుల మధ్య తీవ్ర కలహాలు చోటుచేసుకున్నాయి. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డ వారికి కాకుండా కొత్త వారికి టికెట్లు అమ్ముకుంటున్నారని సీనియర్ నాయకుడు పుల్లూరి కల్యాణ్ ఆరోపించారు. తమకు నచ్చిన వారి పేర్లను అర్హుల జాబితాలో చేర్చి, పార్టీ కోసం కష్టపడ్డ వారి పేర్లను ఎందుకు పక్కన పెడుతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు.

గుర్తింపు లేదు… గౌరవం లేదు.!!

పార్టీ కోసం పనిచేసిన వారికి సరైన గుర్తింపు, గౌరవం, టికెట్లు దక్కడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వార్డుల్లో కార్యక్రమాలు నిర్వహించింది తానే అయినా, టికెట్లు మాత్రం ఇతరులకు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం మంత్రులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, పట్టణ నాయకులు, కార్యకర్తల ముందే జరగడం విశేషంగా మారింది. ఎన్నికల సమయంలో సొంత పార్టీలోనే తలెత్తిన ఈ నేతల కుంపటి కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి పెద్ద తలనొప్పిగా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంపై మంత్రి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. కాగా, నేతల మధ్య చోటుచేసుకున్న మాటల యుద్ధానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ బీ–ఫామ్‌లపై ఎమ్మెల్యే పెత్తనం చేయొద్దు

కాంగ్రెస్ బీ–ఫామ్‌లపై ఎమ్మెల్యే పెత్తనం చేయొద్దు పార్టీ వ్యవహారాల్లో జోక్యాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లో...

పంథా మార్చిన ఇసుక మాఫియా

పంథా మార్చిన ఇసుక మాఫియా సంచుల్లో నింపి రవాణా.. పోలీసుల నిఘాకు చిక్కిన...

మహిళల ఆర్థిక బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం

మహిళల ఆర్థిక బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల...

గద్దెల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలి

గద్దెల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలి భక్తులకు ఇబ్బందుల్లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలి సమ్మక్క–సారలమ్మ జాతర...

హుజురాబాద్‌లో బీజేపీ శక్తి చాటాలి

హుజురాబాద్‌లో బీజేపీ శక్తి చాటాలి మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరేయాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు...

సీనియ‌ర్ల‌కే టికెట్లివ్వాలి

సీనియ‌ర్ల‌కే టికెట్లివ్వాలి ముస్లిం మెజారిటీ డివిజన్లలో ప్రాధాన్యం ఇవ్వాలి జిల్లా కాంగ్రెస్ మైనారిటీ నేతల...

కనీస వేతనాలకు పూర్తి రక్షణ

కనీస వేతనాలకు పూర్తి రక్షణ వీబీ జీ రామ్ జీ చట్టంతో ఉపాధికి...

కార్పొరేషన్ ఎన్నికల్లో

కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరించండి కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం వెలిచాల రాజేందర్‌రావు 48వ డివిజన్‌లో బస్తీబాట యువతకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img