epaper
Saturday, November 15, 2025
epaper

పోలీస్ స్టేష‌న్‌లో దొంగ‌లు ప‌డ్డారు..!

పోలీస్ స్టేష‌న్‌లో దొంగ‌లు ప‌డ్డారు..!
చిన్న‌గూడూరు పీఎస్‌లో సీజ్ చేసిన ఇసుక మాయం
వేలం వేయ‌కుండా అధికారులే అమ్మేశారా..?
ట్రాక్ట‌ర్ల‌కు జ‌రిమానాలు విధించి వ‌దిలేసిన అధికారులు
ఆ త‌ర్వాత ఇసుక‌ను అమ్మేశారంటూ మండ‌లంలో చ‌ర్చ‌
విచార‌ణ చేప‌ట్టాలంటూ రెవెన్యూ అధికారికి వ్య‌క్తి ఫిర్యాదు
మింగ‌లేక‌.. క‌క్క‌లేక అన్న రీతిలో పీఎస్ అధికారుల వైఖ‌రి

కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మ‌హ‌బూబాబాద్ జిల్లా చిన్న‌గూడూరు పోలీస్ స్టేష‌న్‌లో సీజ్ చేసిన ఇసుక మాయ‌మ‌వ‌డంపై ఎవ‌రూ నోరు మెద‌ప‌డం లేదు. ఎలాంటి అనుమ‌తుల్లేకుండా ఇసుక‌ను త‌ర‌లిస్తున్న ట్రాక్ట‌ర్ల‌ను, అందులోని ఇసుక‌ను చిన్న‌గూడూరు పోలీసులు గ‌త నెల 21న సీజ్ చేశారు. జ‌రిమానా విధించి ట్రాక్ట‌ర్ల‌ను వ‌దిలేసిన పోలీసు అధికారులు.. ఇసుక‌ను పోలీస్ స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లో నిల్వ చేశారు. సాధార‌ణంగా ఇలా సీజ్ చేసిన ఇసుక‌ను వేలం పాట ద్వారా విక్ర‌యించి వ‌చ్చిన న‌గ‌దును ప్ర‌భుత్వ ఖ‌జానాకు జ‌మ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా రెవెన్యూ అధికారులు ముంద‌స్తుగా ప్ర‌క‌ట‌న చేసి.. వారి స‌మ‌క్షంలో వేలం పాట నిర్వ‌హించాల్సి ఉంటుంది. వేలం పాట జ‌ర‌గ‌లేదు..కానీ చిన్న‌గూడూరు పీఎస్‌లో ఇసుక మాత్రం మాయ‌మ‌వ‌డంపై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

అస‌లు నాకేం తెల్వ‌దు : ఎమ్మార్వో సంప‌త్‌

సీజ్ చేసి పీఎస్‌లో నిల్వ ఉంచిన ఇసుక క‌నిపించ‌డం లేద‌ని, అధికారుల నుంచి కూడా ఎలాంటి స‌మాచారం ఉండ‌టం లేద‌ని దీనిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరుతూ ఈనెల 4న త‌హ‌సీల్దార్ సంప‌త్‌కు ఉప్ప‌ల‌య్య అనే వ్య‌క్తి రాత పూర్వ‌కంగా ఫిర్యాదు చేశారు. దీనిపై విచార‌ణ అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ముందుకు సాగిన‌ట్లు క‌నిపించ‌డం లేదు. ఈవిష‌యంపై కాక‌తీయ‌ మ‌హ‌బూబాబాద్ ప్ర‌తినిధి త‌హసీల్దార్ సంపత్‌ను ఫోన్‌లో వివ‌ర‌ణ కోరగా.. ఇసుక ట్రాక్ట‌ర్ల‌ను ప‌ట్టుకున్న విష‌యం గాని, నిల్వ ఉంచిన విష‌యం గాని, వేలంపాట నిర్వ‌హించారా..? లేదా అన్న విష‌యం గాని త‌న‌కు తెలియ‌ద‌ని వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. స‌హ‌జంగా ట్రాక్ట‌ర్ల‌ను ప‌ట్టుకున్న‌ప్పుడు ఖ‌చ్చితంగా మండ‌ల మేజిస్ట్రేట్‌కు స‌మాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ త‌హ‌సీల్దార్ త‌న‌కు ఏమాత్రం స‌మాచార‌మే లేద‌ని చెప్ప‌డం ఇప్పుడు పోలీసుల నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని, పూర్తిగా త‌మ‌కు తోచిన‌ట్లుగా, ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించార‌నే ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూర్చిన‌ట్లవుతోంది. ఇదే విష‌యంపై చిన్న‌గూడూరు పోలీస్ స్టేష‌న్ ఎస్సై ప్ర‌వీణ్‌ను ఫోన్‌లో వివ‌ర‌ణ కోరే ప్ర‌య‌త్నం చేయ‌గా స్పందించలేదు. చిన్న‌గూడూరు పీఎస్‌లో ఇసుక మాయ‌మైన ఘ‌ట‌న‌లో పోలీసు అధికారికి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉండేందుకు ఈ ఘ‌ట‌న‌తో భాగ‌స్వామ్యం ఉన్న వారంతా కూడా ఓ క‌థ అల్లి ఉన్న‌తాధికారుల‌కు వినిపించేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేష‌న్‌లోనే ఇసుక మాయం ఘ‌ట‌న‌పై స‌రైన వివ‌ర‌ణ ఇవ్వ‌లేక‌.. పోలీస్ స్టేష‌న్ అధికారుల ప‌రిస్థితి మింగ‌లేక‌.. క‌క్క‌లేక అన్న చందంగా మారింద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

దందాకు అధికారుల దారులు.. దారికి రాకుంటేనే త‌నిఖీలు

మ‌హ‌బూబాబాద్ జిల్లా చిన్న‌గూడూరు మండ‌లంలోని పోలీస్‌, రెవెన్యూ అధికారుల ఇసుక అక్ర‌మ ర‌వాణా కాసుల వ‌ర్షం కురిపిస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. ఈ శాఖ‌ల్లోని చైన్ మేనేజ్‌మెంట్ వ‌సూళ్ల ప‌ర్వంతో.. ఇసుక అక్ర‌మ ర‌వాణాదారుల నుంచి అందిన‌కాడికి దోచుకోవ‌డం.. పైస‌లిస్తే స‌రేస‌రి.. లేదంటే నిబంధ‌న‌లు..త‌నిఖీల పేరుతో దందాకు అడ్డు త‌గులుతూ దారికి తెచ్చుకోవ‌డం అన్న‌ది కొంత‌మంది అధికారులు అనుస‌రిస్తున్నార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఇసుక‌ అక్ర‌మ ర‌వాణా చేస్తున్న ట్రాక్ట‌ర్ య‌జ‌మానుల నుంచి వారం వారం వ‌సూళ్లకు పాల్ప‌డుతున్న‌ట్లుగా తెలుస్తోంది. రెండు శాఖల అధికారులకు మాత్రం ఈ దందా రెండు విధాలా జేజుబులు నింపుతున్న‌ట్లుగా కూడా ఆరోప‌ణ‌లున్నాయి.

పట్టుకున్నా పైస‌ల్‌..విడిచినా పైస‌లే..

మ‌హ‌బూబాబాద్ జిల్లా చిన్న‌గూడూరు మండ‌లంలో జ‌రుగుతున్న ఇసుక అక్ర‌మ ర‌వాణా దందాలో అధికారుల‌కు ట్రాక్ట‌ర్ల‌ను ప‌ట్టుకున్నా పైస‌ల్‌..విడిచినా పైస‌లే అన్న చందంగా మారిందంట‌.మండ‌లంలో ఇసుక అక్ర‌మ ర‌వాణా ఇసుకాసురుల‌కే కాదు.. అధికారుల‌కు ఆదాయ మార్గంగా మారుతోందంట‌. ఇసుక‌ అక్ర‌మ ర‌వాణాపై నామ‌మాత్రంగా చ‌ర్య‌లు తీసుకోవ‌డం.. ఆత‌ర్వాత మ‌మ అనిపించే క‌థ చేస్తున్న‌ట్లుగా విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. జిల్లా క‌లెక్ట‌ర్ అద్వైత్‌కుమార్ స్వ‌యంగా ఈ దందాపై ఫోక‌స్ చేయాల‌ని కూడా జిల్లా ప్ర‌జ‌లు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ ప్రజెంటేషన్ లను సమీక్షించిన కూడా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img