“ఓడిపోతామనే భయంతోనే ఒత్తిడి తెస్తున్నారు”
•బాల్క సుమన్
కాకతీయ,రామకృష్ణాపూర్ : అధికార పార్టీ కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తమ అభ్యర్థులకు ఫోన్లు చేస్తూ,భయభ్రాంతులకు గురి చేస్తూ,వారిపై ఒత్తిడి చేస్తున్నారని మాజీ చెన్నూరు ఎమ్మెల్యే,మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ ఆరోపించారు. మంగళవారం క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 16 వ వార్డులో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారంతా అభ్యర్థి కృపానందంకు మద్దతుగా ఉన్నారని తెలిపారు. అనంతరం కృపానందంకు స్వగృహానికి చేరుకొని కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అంత మీకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. పల్లె భూమేష్,రాజా రమేష్,సుదర్శన్ గౌడ్,కుమార్,నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.


