epaper
Monday, March 2, 2026
epaper

సారొస్తున్నారు

  • రేపు వ‌రంగ‌ల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే
  • ప్రతికూల వాతావరణంతో నిన్న‌టి పర్యటన వాయిదా
  • తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష‌
  • పంట నష్టాన్ని ముఖ్యమంత్రికి వివరించిన క‌లెక్ట‌ర్లు
  • ఇన్‌ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలోనే ఉండాలి
  • అధికారులు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాలి
  • ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి
  • అవ‌స‌ర‌మైతే దగ్గరలోని ఫంక్షన్‌హాల్స్‌కు తరలించాలి
  • ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
  • అధికార యంత్రాంగానికి రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల ఇవాళ వరంగల్ పర్యటన వాయిదా వేసుకున్నారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలోనే ఉండాలని, మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కష్టాల్లో ఉన్న బాధితుల‌ను ఆదుకునే ప్రయత్నం చేయాలని, ప్రజలను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. వరద సహాయక చర్యలకు అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని రేవంత్ వివరించారు.

క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫరెన్స్‌

తెలంగాణలో మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వివిధ జిల్లాల్లో కురిసిన వర్షాలు, జరిగిన నష్టాన్ని కలెక్టర్లు సీఎంకు వివరించారు. దెబ్బతిన్న పంటలు, రహదారులకు సంబంధించిన ప్రాథమిక వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పొందే వరదసాయం అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. పంటల కొనుగోళ్లపై జిల్లాల అధికారులతో చర్చించిన సీఎం ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

రిపోర్ట్ ఇవ్వని అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలి

ధాన్యం సేకరణ కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్‌హాల్స్‌కు తరలించాలని ఆదేశించారు. పౌరసరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు చేయాలని అన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి మండలస్థాయి అధికారిని నియమించాలని, ప్రతి కొనుగోలు కేంద్రం నుంచి 24 గంటలకోసారి కలెక్టర్‌కు రిపోర్టు చేరాలని సూచించారు. ధాన్యం కొనుగోలుపై రిపోర్ట్ ఇవ్వని అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని స్ఫష్టంచేశారు. వరదలకు దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడూ పరిశీలిస్తుండాలని, చెరువులు, వాగులు, కల్వర్టుల వద్ద ప్రజలను ముందుగానే అలర్ట్ చేయాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

వాతావరణశాఖ హెచ్చరికల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని, సిబ్బంది సెలవులు రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించేలా కలెక్టర్లు చూడాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా అప్రమత్తంగా ఉండాలని, దెబ్బతిన్న రోడ్ల వద్ద ట్రాఫిక్‌ను మళ్లించాలని సూచించారు. అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని, వరంగల్‌లో అవసరమైతే హైడ్రా సేవలు వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి కలెక్టర్లు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలపాలని, ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు అందించాలి

వరంగల్‌లో వరద బాధితులకు సహాయక చర్యలను ముమ్మరం చేయాలన్న సీఎం అవసరమైనన్ని పడవలను వెంటనే వరద ప్రభావిత ప్రాంతాలకు పంపించాలని అని ఆదేశించారు. ఎస్‌డీఆర్ఎఫ్‌ సిబ్బందిని తక్షణమే వరద ప్రభావిత ప్రాంతాలకు తరలించాలని హెచ్చరించారు. హైడ్రా సిబ్బందిని, సహాయ సామగ్రిని కూడా ఉపయోగించుకోవాలని, ముంపు ప్రాంతాల్లో ఉన్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలని, వరదల్లో చిక్కుకున్నవారికి డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు అందించాలని ముఖ్య‌మంత్రి సూచించారు.

అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల ఇవాళ వరంగల్ పర్యటన వాయిదా వేసుకున్నాన్న సీఎం.. తుపాను ప్రభావిత జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో ఉండాలని, మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కష్టాల్లో ఉన్న ప్రజ…

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img