“రాజకీయ లబ్ధి కోసమే బద్నాం చేస్తున్నారు”
* మంత్రి వివేక్ వెంకటస్వామి
కాకతీయ, మంచిర్యాల : తమ రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీని బాల్క సుమన్ బద్నాం చేస్తున్నారని చెన్నూరు ఎమ్మెల్యే,కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. చెన్నూరు నియోజవర్గంలో హింసను ప్రోత్సహిస్తే సహించేది లేదన్నారు. సుమన్ లాగా బెదిరింపు,రౌడీ రాజకీయాలు చేస్తే ప్రజాస్వామ్యానికి అర్ధం ఉండదని మంత్రి హితవు పలికారు. చెన్నూరు,క్యాతన్ పల్లి మున్సిపాలిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని,ఎన్నికైన చైర్ పర్సన్,వైస్ చైర్ పర్సన్ లకు మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.


