epaper
Saturday, November 15, 2025
epaper

పత్తి కొనుగోలులో దళారుల ప్రమేయం ఉండవద్దు.

  • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

కాకతీయ, లక్షెటిపేట : పత్తి కొనుగోలులో దళారుల ప్రమేయం ఉంటే కొనుగోలు చేయవద్దని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని వెంకటేశ్వర కాటన్ మిల్ లో సి సి ఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ, జిల్లా మార్కెటింగ్ అధికారి షాహబోద్దీన్, సి. సి. ఐ అధికారులు, మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం సి సి ఐ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి పత్తి కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.

2025- 26 సంవత్సరంలో మద్దతు ధర క్రింద సి.సి.ఐ. కు పత్తి విక్రయించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్ లో రైతులు తమ వివరాలు నమోదు చేసుకుని, పత్తి విక్రయానికి స్లాట్ బుక్ చేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈసారి ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 స్థాయిలలో స్లాట్ బుకింగ్ చేయడం జరుగుతుందని, ప్రతి స్థాయిలో 75 శాతం స్లాట్ లు బుక్ అయిన తర్వాత స్థాయిలో బుకింగ్ ఓపెన్ అవుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు నిబంధనల ప్రకారం పత్తిలో 8 నుండి 12 తేమ శాతం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని రైతుల వద్ద నుండి పత్తి కొనుగోలు చేయాలని సూచించారు.

ఆధార్ నంబర్ కు అనుసంధానం చేయబడిన బ్యాంకు ఖాతాలో మాత్రమే చెల్లింపులు జరుగుతాయని, ఆధార్ కార్డులో ఫోటో కలిగి ఉన్న రైతు మాత్రమే తక్పట్టిలో ఫోటో దిగవలసి ఉంటుందని తెలిపారు. క్రాప్ బుకింగ్ లో నమోదు చేసిన రైతుల నుండి కొనుగోలు చేయడం జరుగుతుందని, మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి సమన్వయంతో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పత్తి కొనుగోలుతో పాటు వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లాలో చేపట్టడం జరుగుతుందని, రైతులు నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్, వైస్ చైర్మన్ ఆరీఫ్ సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరుగుతున్న రహదారి...

17 వ మహాసభ జయప్రదం చేయాలి

17 వ మహాసభ జయప్రదం చేయాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : మందమర్రిలో ఈ...

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : ఓపెన్ కాస్ట్ ఫేజ్...

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప...

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్..

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్.. జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ బంపర్ "వి"క్టరీ.. సోమాజిగూడ...

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల రఘునాథపాలెం మండలంలో పొలాలు సందర్శించిన మంత్రి...

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌ రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నిర్వహణ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ...

తిమ్మాపూర్ సర్కిల్ పోలీసు స్టేషన్లను తనిఖీ..

తిమ్మాపూర్ సర్కిల్ పోలీసు స్టేషన్లను తనిఖీ.. తనిఖీ చేసిన అడిషనల్ డీసీపీ వెంకటరమణ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img