epaper
Monday, March 2, 2026
epaper

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలకు పూర్వ వైభవం

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలకు పూర్వ వైభవం
సర్పంచ్ పదవే రాజకీయ భవిష్యత్తుకు పునాది
గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలి
ప్రభుత్వ విప్‌, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్ర నాయక్
మరిపెడలో రూ.26 కోట్లతో 100 పడకల ఆసుపత్రి ప్రారంభం

కాకతీయ, మరిపెడ : గ్రామ అభివృద్ధికి సర్పంచ్‌నే కేంద్ర బిందువని, ప్రతి గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచేనని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌, ప్రభుత్వ విప్‌, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రామచంద్ర నాయక్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలకు పూర్వ వైభవం తిరిగి వస్తుందని స్పష్టం చేశారు. శనివారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని భార్గవ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో డోర్నకల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ సర్పంచులకు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ సర్పంచ్ పదవి రాజకీయ భవిష్యత్తుకు తొలి మెట్టని అన్నారు. గ్రామ ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసినందున సర్పంచులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని సూచించారు. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త యుద్ధ సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.

రూ.26 కోట్లతో 100 పడకల ఆసుపత్రి

అనంతరం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో రూ.26 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని డిప్యూటీ స్పీకర్ ప్రారంభించారు. ఈ ఆసుపత్రి ద్వారా పేద ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇకపై పోస్టుమార్టం కోసం మహబూబాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదని, ఆసుపత్రిలో సుమారు 40 మంది వైద్య సిబ్బంది సేవలు అందిస్తారని చెప్పారు. పేదల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను ప్రారంభిస్తోందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కొమ్ము యుగంధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎస్.కె. తాజుద్దీన్, అఫ్జల్, ఐలమల్లు, గుండగాని వెంకన్న, వేణు, సాయి, అభినవ రెడ్డి, అంబరీష్, రామ్‌లాల్, కాలం రవీందర్ రెడ్డి, దశ్రు నాయక్, కమలాకర్ రెడ్డి, రాజశేఖర్, అంబటి వెంకటరెడ్డి, బట్టు నాయక్, రాము నాయక్, లక్ష్మీపతి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కేజీబీవీలో జిల్లా ప్యానెల్ తనిఖీలు

కేజీబీవీలో జిల్లా ప్యానెల్ తనిఖీలు నల్లబెల్లిలో కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయ సందర్శన బోధన...

నిట్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

నిట్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాక‌తీయ‌,వరంగల్: వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థలో నిర్వహించిన...

12వ వార్డులో అభివృద్ధి ప‌నులు ప్రారంభం

12వ వార్డులో అభివృద్ధి ప‌నులు ప్రారంభం కాక‌తీయ‌, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండల...

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img