లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం
కాకతీయ, కరీంనగర్ : సేవా కార్యక్రమాల్లో ముందుండే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మల్కాపూర్ ఎస్సీ కాలనీలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరం స్థానికంగా విశేష స్పందన పొందింది. శిబిరాన్ని 16వ డివిజన్ కార్పొరేటర్ కంతాల జగన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలోని అవసరార్థులకు లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని అన్నారు.
రేకుర్తి కంటి ఆసుపత్రి సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ రాజరాజేశ్వరి కరీంనగర్ ఈ శిబిరాన్ని నిర్వహించింది. మొత్తం 65 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 11 మందికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు గుర్తించారు. వారికి ఈ నెల 9న రేకుర్తి కంటి ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
శిబిరంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నరహరి లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి బండ కిషన్ రెడ్డి, సీనియర్ సభ్యుడు రాళ్లబండి శంకర్ ప్రసాద్ రెడ్డి, సంధి మోహన్ రెడ్డి, బొంగోని పరుశురాం, ఎడబోయిన సంజీవరెడ్డి, దువ్వంతుల మునిందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


