epaper
Saturday, November 15, 2025
epaper

అటవీ శాఖ అమరుల త్యాగం చిరస్మరణీయం: మంత్రి కొండా సురేఖ

కాకతీయ, తెలంగాణ బ్యూరో: విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ శాఖ సిబ్బందిని స్మరించుకుంటూ, గురువారం (సెప్టెంబర్ 11) నెహ్రూ జూలాజికల్ పార్కులో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమెతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ డాక్టర్ జితేందర్, పీసీసీఎఫ్ సువర్ణ, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తదితరులు పాల్గొన్నారు.

మంత్రి మాట్లాడుతూ.. 1730లో రాజస్థాన్‌లో బిష్నోయి తెగకు చెందిన 360 మంది కేజ్రి చెట్లు కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన సంఘటనను గుర్తుచేసుకుంటూ, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది సెప్టెంబర్ 11న “అటవీ అమరవీరుల దినోత్సవం”గా నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణలో కూడా ఈ రోజున ప్రతి సంవత్సరం అటవీ సిబ్బంది త్యాగాలను స్మరించుకుంటూ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు.

అటవీ సిబ్బంది త్యాగాలు:
తెలంగాణలో 1984 నుండి ఇప్పటివరకు 22 మంది అటవీ అధికారులు, సిబ్బంది తమ ప్రాణాలను అర్పించి, అడవులను రక్షించారని మంత్రి గుర్తు చేశారు. అక్రమ కలప రవాణా, అటవీ భూముల ఆక్రమణలను అరికట్టడంలో వీరు అచంచల ధైర్యంతో పని చేశారని కొనియాడారు. 2014 నుండి 2025 జూలై వరకు టేకు, మారు జాతి కలప స్మగ్లింగ్‌ కేసులు, 10,375 భూ ఆక్రమణ కేసులు నమోదు అయ్యాయి. 2025 సంవత్సరంలో మాత్రమే 96,813 కేసులు నమోదు చేసి, రూ.149.66 కోట్ల విలువైన కలపను స్వాధీనం చేసుకుని, రూ.51.50 కోట్ల జరిమానా వసూలు చేశారని వివరించారు. అదేవిధంగా 18,002 వాహనాలు స్వాధీనం చేసుకోవడం, 29,858 గుర్తు తెలియని కేసులు (UDOR) నమోదు చేసి, రూ.67.13 కోట్ల విలువైన అక్రమ కలపను స్వాధీనం చేసినట్లు తెలిపారు.

అటవీ రక్షణ కోసం చర్యలు:

*రాష్ట్రంలో 174 బేస్ క్యాంపులు, 62 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.

*అడవుల్లో పశువుల చొరబాటును అరికట్టేందుకు కాలువలు నిర్మిస్తున్నారు.

*సాయుధ పోలీసు దళాల సహాయంతో కలప స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

*PD Act కింద టేకు అక్రమ రవాణాదారులపై 5 కేసులు నమోదు చేశారు.

అలాగే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అటవీ శాఖను బలోపేతం చేయడానికి 2,118 వాహనాలు (2008 బైక్‌లు, 110 జీపులు) అందజేశామని, 2022లో 1,516 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చి, ప్రస్తుతం రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు.

అటవీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది:
అడవులను రక్షించడమే కాకుండా, వన్యప్రాణుల ఆవాసాలను మెరుగుపరచడానికి పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అటవీ సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, అమరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు, రిటైర్డ్ సిబ్బంది, అమరుల కుటుంబ సభ్యులు పాల్గొని, తమ త్యాగాలతో చరిత్రలో నిలిచిపోయిన అటవీ అమరవీరులను స్మరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..!

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..! జూబ్లీహిల్స్ ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి.. కాక‌తీయ‌, హైదరాబాద్ : జూబ్లీహిల్స్...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

క‌వి అందె శ్రీ క‌న్నుమూత‌

క‌వి అందె శ్రీ క‌న్నుమూత‌ కాక‌తీయ‌, హైద‌రాబాద్ : వాగ్గేయ‌కారుడు, క‌వి అందె...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img