బతుకమ్మ కుంట పునరుద్ధరణ భేష్
హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సురేఖ కితాబు
ఎండోమెంట్ భూముల పరిరక్షణకు హైడ్రా సాయం కావాలన్న మంత్రి
సీఎం అనుమతితో చర్యలు తీసుకునేందుకు యత్నిస్తామన్న రంగనాథ్
సచివాలయంలో ఇరువురి భేటీ..
కాకతీయ, తెలంగాణ బ్యూరో, హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంత్రి కొండా సురేఖతో గురువారం సచివాయలంలో భేటీ అయ్యారు. బతుకమ్మ కుంట పునరుద్ఘరణ విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ను మంత్రి సురేఖ అభినందించారు. బతుకమ్మ కుంట పునరుద్దరణకు శభాష్ అంటూ కితాబు ఇచ్చారు. అయితే, తన పరిధిలో ఉన్న ఎండోమెంటు శాఖలోని భూముల పరిరక్షణకు హైడ్రా సాయం అవసరమని మంత్రి గుర్తు చేయగా… సీఎం అనుమతితో చర్యలు తీసుకుంటామని రంగనాథ్ మంత్రి సురేఖకు వివరణ ఇచ్చారు. దేవాదాయ శాఖ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని పరిక్షించేందుకు ఇప్పటికే డీజీపీఎస్ సర్వే చేపడుతున్నట్టు చెప్పారు. అందుకోసం ప్రభుత్వ పరంగా… శాఖ పరంగా కావాల్సిన సాంకేతిక అంశాలపై దృష్టి సారిస్తామని చెప్పారు.
బతుకమ్మ వేడకులకు ఆహ్వానం
హైడ్రా వచ్చాక చేపట్టిన పనుల వివరాలను రంగనాథ్… మంత్రికి సమగ్రంగా వివరించారు. అయితే, మంచి పనులు చేసే సందర్భంగా కొన్ని ఇబ్బందులు ఎదరవుతాయని… కానీ, సామూహిక ప్రయోజనంలో భాగంగా చేశారని మంత్రి సురేఖ కొనియాడారు. హైడ్రా చేస్తున్న పనులు రానున్న కాలంలో అందరికీ తెలుస్తాయని అన్నారు. ఈసందర్భంగా మంత్రి సురేఖ వరంగల్ నాలాల ఆక్రమణలను కూడా రంగనాథ్తో చర్చించారు. వాటిని పరిష్కరించేందుకు తమకు సహకరించాలని అన్నారు. అందుకు ఆయన సుముఖత తెలిపారు. కాగా, బతుకమ్మ కుంట వేడకులకు మంత్రి సురేఖను రంగనాథ్ ఆహ్వానించారు.


