epaper
Thursday, January 15, 2026
epaper

పేదల బియ్యం గల్లంతు

పేదల బియ్యం గల్లంతు
కరీంనగర్ జిల్లాలో భారీ సీఏంఆర్ స్కామ్
35,563 మెట్రిక్ టన్నుల బియ్యం డిఫాల్ట్
ప్రభుత్వానికి రూ.124 కోట్లకుపైగా నష్టం
ఏళ్లుగా డిఫాల్టర్లపై చర్యలే లేవు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లాలో పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యం భారీగా మాయం కావడం తీవ్ర సంచలనంగా మారింది. సీఏంఆర్ (కస్టమ్ మిల్ల్డ్ రైస్) పేరుతో ప్రభుత్వానికి అందాల్సిన బియ్యం ఏళ్ల తరబడి మిల్లుల వద్దే నిలిచిపోవడంతో ఖజానాకు వందల కోట్ల నష్టం వాటిల్లిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లెక్కల ప్రకారం వేల మెట్రిక్ టన్నుల బియ్యం డిఫాల్ట్‌గా నమోదవుతున్నా, సంబంధిత మిల్లులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వెనుక అధికారుల నిర్లక్ష్యం, అండదండలే కారణమన్న విమర్శలు బలపడుతున్నాయి. పేదల కడుపు నింపాల్సిన బియ్యం దారి మళ్లుతుండటంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

2012 నుంచే మొదలైన బకాయిలు

కరీంనగర్ జిల్లా రేషన్ వ్యవస్థలో సీఏంఆర్ డిఫాల్ట్ సమస్య కొత్తది కాదని అధికారిక రికార్డులే చెబుతున్నాయి. 2012–13 ఖరీఫ్ నుంచే బకాయిలు మొదలై 2024 వరకు కొనసాగుతున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2012–13 ఖరీఫ్‌లో 2,589.866 మెట్రిక్ టన్నులు, 2013–14 రబీ సీజన్‌లో 35.316 మెట్రిక్ టన్నులు, 2014–15 ఖరీఫ్‌లో 178.782 మెట్రిక్ టన్నులు డిఫాల్ట్‌గా నమోదయ్యాయి.
తర్వాత కొంత విరామం అనంతరం 2021–22 ఖరీఫ్‌లో 4,106.105 మెట్రిక్ టన్నులు, 2022–23 రబీ సీజన్‌లో ఏకంగా 20,115.377 మెట్రిక్ టన్నులు, 2023–24 ఖరీఫ్‌లో మరో 8,507.130 మెట్రిక్ టన్నుల బియ్యం పెండింగ్‌లో ఉన్నట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి.

19 మిల్లులు.. 22 డిఫాల్ట్ ఎంట్రీలు

జిల్లాలో మొత్తం 19 రైస్ మిల్లులు డిఫాల్ట్‌గా నమోదైనట్లు అధికారిక జాబితా చెబుతోంది. కొన్ని మిల్లులు పునరావృతంగా బకాయిలు పెంచుకున్నట్లు రికార్డుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 22 డిఫాల్ట్ ఎంట్రీలతో ప్రభుత్వానికి అందాల్సిన సీఏంఆర్ బియ్యం 35,563.576 మెట్రిక్ టన్నులుగా తేలింది. ప్రస్తుత ధరల ప్రకారం దీని విలువ సుమారు రూ.137 కోట్లుగా ఉండగా, కనీసం రూ.124 కోట్లకు పైగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఒక్క జిల్లాలోనే ఇంత భారీ మొత్తంలో బియ్యం గల్లంతు కావడం రేషన్ వ్యవస్థ పర్యవేక్షణపై తీవ్ర సందేహాలు రేకెత్తిస్తోంది.

నామమాత్రపు కేసులకే పరిమితమైన చర్యలు

ఇంత భారీ స్థాయిలో డిఫాల్ట్‌లు నమోదవుతున్నా అధికారుల చర్యలు మాత్రం కాగితాలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డిఫాల్ట్ మిల్లులపై రికవరీ చర్యలు, లైసెన్సుల రద్దు, కఠిన శిక్షలు వంటి చర్యలు ఎక్కడా కనిపించడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సందర్భాల్లో నామమాత్రపు కేసులు నమోదు చేసి వ్యవహారాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
ఏళ్ల తరబడి బకాయిలు పేరుకుపోతున్నా బాధ్యత వహించాల్సిన శాఖలు మౌనంగా ఉండటం వెనుక అధికారుల అండదండలు ఉన్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ధోరణి కొనసాగితే రేషన్ వ్యవస్థలో డిఫాల్ట్‌లు మరింత పెరిగే ప్రమాదం ఉందని, తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img