epaper
Saturday, March 28, 2026
epaper

రాజీ మార్గమే రాజ మార్గం..

రాజీ మార్గమే రాజ మార్గం..

రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు

జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్

కాకతీయ, ఖమ్మం బ్యూరో: రాజీ మార్గమే రాజా మార్గమని, రాజీ పడదగ్గ కేసులలో రాజీ పడి సత్వర న్యాయం పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. రాజగోపాల్ అన్నారు. శనివారం జిల్లా కోర్టు లోని న్యాయ సేవా సదన్ లో జాతీయ లోక్ అదాలత్ ను జిల్లా ప్రిన్సిపల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, లోక్ అదాలత్ లో రాజీతో ఇరువర్గాలు గెలిచినట్లేనని, లోక్ అదాలత్ తీర్పు, సుప్రీంకోర్ట్ తుది తీర్పుతో సమానమని అన్నారు. లోక్ అదాలత్ లను కక్షిదారులు సద్వినియోగం చేసుకోని త్వరితగతిన కేసులను పరిష్కరించుకోవాలని అన్నారు. రాజీ మార్గంలో కక్షిదారులు లోక్ అదాలత్ లను సద్వినియోగం చేసుకొని తమ కేసులను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు. కేసులను రాజీతో ముగించేందుకు ఇలాంటి లోక్ అదాలత్ లు ఉపయోగ పడతాయన్నారు. ఎలాంటి ఫీజు లేకుండా న్యాయ సేవా సంస్థ సహకారంతో కేసులను పూర్తి చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

కేసులు రాజీ చేసుకోవడం ద్వారా అప్పీలు చేసుకోవడం ఉండదని, కోర్టు చుట్టూ తిరిగితే సమయం, డబ్బు వృధా అవుతుందని, కేసుల పరిష్కారంతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని, లోక్ అదాలత్ ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. కేసుల సత్వర పరిష్కారంతో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దామని అన్నారు. కుటుంబ వివాదాల కేసులలో ముఖ్యమైనవి భార్యాభర్తల కేసుల వివాదాలలో ఇద్దరు కలిసి ఉంటే, వారి సంతానంతో పాటు ఇరువర్గాల కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఉండి, ఆరోగ్యమైన సమాజం ఏర్పడుతుందని తెలిపారు.

గత లోక్ అదాలత్ లో 8490 కేసుల పరిష్కారం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా 6వ స్థానంలో నిలిచిందన్నారు. ఇందులో 63 మోటారు వాహన ప్రమాదాల కేసులు పరిష్కరించి, 4 కోట్ల 28 లక్షల 98 వేల రూపాయలు పరిహారం క్రింద అందించామని ప్రధాన నాయమూర్తి తెలిపారు. ప్రస్తుత లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారంలో జిల్లా ఇంకా మెరుగైన స్థానం సాధించాలన్నారు. ఇందుకు భాగస్వాములందరూ లక్ష్య సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు.
క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంక్ రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాదం, డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టి కేసులు, ఇతర రాజీపడ్డ దగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో కేసుల పరిష్కారంతో కక్షిదారుల మధ్య సుహృద్భావ వాతావరణం తో పాటు, గ్రామాల్లో ప్రశాంతత నెలకొంటుందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. లోక్ అదాలత్ లో ఒకరు గెలవడం, ఒకరు ఓడడం ఉండదని, ఇద్దరు విజేతలేనని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు తొండపు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, భేషజాలకు పోకుండా, ఇరువర్గాల గెలుపు లోక్ అదాలత్ లో ఉంటుందని అన్నారు. పగ, ద్వేషం, కక్ష, ప్రతీకారం ఉంచుకోవద్దని, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని, శత్రువునైనా ప్రేమించే తత్వం అలవర్చుకోవాలని తెలిపారు. లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా లోక్ అదాలత్ లో మోటార్ వాహన కేసుకు సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ప్రమాద మరణానికి సెటిల్ మెంట్ కు సంబంధించి, ఫ్యామిలీ కేసుకు సంబంధించి పరిష్కారం చేసి, అవార్డు తోపాటు పూల మొక్కలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి బహుకరించారు.
ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి, సీనియర్ సివిల్ జడ్జ్, న్యాయ సేవా సదన్ ఇంచార్జ్ కార్యదర్శి కల్పన, తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీనివాసరావు, న్యాయమూర్తులు, న్యాయాధికారులు, న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు, మీడియేటర్స్, న్యాయవాదులు, కక్షిదారులు, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పాత పద్ధతిలో మెడికల్ బోర్డును నిర్వహించాలి

పాత పద్ధతిలో మెడికల్ బోర్డును నిర్వహించాలి అంబేద్కర్ చిత్రపటానికి వినతిపత్రం అందచేసిన కార్మికులు అసెంబ్లీలో...

కుమారుడితో కలిసి గోదావరి లో దూకిన మహిళ

కుమారుడితో కలిసి గోదావరిలో దూకిన మహిళ తల్లీ,కొడుకు లను కాపాడిన స్థానిక యువకులు...

మతోన్మాదానికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలి

మతోన్మాదానికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలి భగత్ సింగ్ స్ఫూర్తితో ఐక్య పోరాటం పీవైఎల్, పిడిఎస్‌యూ,...

ట్రాఫిక్ నియమాలు పాటించండి – సురక్షితంగా గమ్యం చేరండి

ట్రాఫిక్ నియమాలు పాటించండి - సురక్షితంగా గమ్యం చేరండి *వైరా ఏసీపీ కాకతీయ, ఖమ్మం...

రాజీ మార్గమే రాజమార్గం

రాజీ మార్గమే రాజమార్గం కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ సువర్ణావకాశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

నేత్రపర్వంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం

నేత్రపర్వంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం రామనామ స్మరణలతో మార్మోగిన మిథిలా ప్రాంగణం పట్టువస్తాలను సమర్పించిన...

ఇద్దరు సైబర్ నేరస్తులను అరెస్టు

ఇద్దరు సైబర్ నేరస్తులను అరెస్టు కాకతీయ, ఖమ్మం బ్యూరో: ఆన్లైన్ లో ట్రేడింగ్,...

కొత్త తహసీల్దార్ కు సమస్యల సవాళ్లు..

కొత్త తహసీల్దార్ కు సమస్యల సవాళ్లు.. ఆర్ఐ , సర్వేయర్ ల అవినీతిపై నిగ్గు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img