epaper
Thursday, January 15, 2026
epaper

త‌ప్పులు మీవి.. కేంద్రంపై బుర‌ద జ‌ల్లుతారా..?!

త‌ప్పులు మీవి.. కేంద్రంపై బుర‌ద జ‌ల్లుతారా..?!
అబద్దాల పోటీలు పెడితే కాంగ్రెస్–బీఆర్ఎస్‌కే అవార్డులు
కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కును కేసీఆర్ తాకట్టు పెట్టారు
యూపీఏ విభజన చట్టంతోనే తెలంగాణ‌కు అన్యాయం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కాకతీయ, తెలంగాణ బ్యూరో : కృష్ణా జలాల వాటా విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేసిన ఘోర తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాకు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘‘హైదరాబాద్‌లో జాతీయ అబద్దాల పోటీలు నిర్వహిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తొలి రెండు అవార్డులు ఖాయంగా దక్కుతాయి’’ అని ఎద్దేవా చేశారు. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు 555 టీఎంసీలు రావాల్సి ఉండగా, కేవలం 299 టీఎంసీలకే సరిపోతుందని కేసీఆర్ ఒప్పందం చేసుకున్నదే చరిత్రలో అతిపెద్ద ద్రోహమని బండి సంజయ్ ఆరోపించారు. 2015 జూన్ 19న జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీకి అనుకూలంగా కేసీఆర్ సంతకం చేశారని గుర్తు చేశారు. ఆ ఒప్పంద పత్రాలను ఆనాడే తానే బయటపెట్టిన విషయాన్ని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నా కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో కేంద్రాన్ని తప్పుపట్టడం పూర్తిగా అవగాహనలేమి ఫలితమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. గోదావరి ట్రైబ్యునల్ ప్రకారం పోలవరం ద్వారా వచ్చే 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డికి వినియోగించుకోవచ్చని కేంద్రం స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. అయితే 90 టీఎంసీల నీటి వినియోగానికి సంబంధించిన సమగ్ర వివరాలు పంపకపోవడంతోనే డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపిందని, తిరస్కరించలేదని తెలిపారు. నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపించారు.

యూపీఏ విభజన చట్టమే మూలకారణం

తెలంగాణకు మొదటి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్ర విభజన చట్టం–2014లోని సెక్షన్ 89 కారణంగా బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులను టచ్ చేయరాదని నిబంధన పెట్టి తెలంగాణను దెబ్బతీశారని విమర్శించారు. ఈ పరిమితుల వల్లే కొత్త ట్రైబ్యునల్ కూడా నీటి కేటాయింపులపై పూర్తిగా విచారణ చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. యూపీఏ చేసిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు మోదీ ప్రభుత్వం 2023 అక్టోబర్ 6న కొత్త ట్రైబ్యునల్‌కు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ జారీ చేసి కృష్ణా బేసిన్ మొత్తాన్ని శాస్త్రీయంగా పునర్విభజన చేసే అవకాశాన్ని కల్పించిందని గుర్తు చేశారు. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే బదులు రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా టెక్నికల్, లీగల్ వాదనలు వినిపించకుండా రాజకీయ ఆరోపణలకే పరిమితమవడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఇకనైనా నీటి కేటాయింపులు, డీపీఆర్ రూపకల్పనలో చేసిన తప్పిదాలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అంగీకరించి తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అసెంబ్లీని దూషణలకు వేదికగా మార్చకుండా తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను సాధించేందుకు కలిసి పనిచేయాలని సూచించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img