పాత పద్ధతిలో మెడికల్ బోర్డును నిర్వహించాలి
అంబేద్కర్ చిత్రపటానికి వినతిపత్రం అందచేసిన కార్మికులు
అసెంబ్లీలో డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై అభ్యంతరం
ఏఐటియుసి ఆధ్వర్యంలో పివికే5 గనిలో నల్ల రిబ్బన్లతో వినూత్న నిరసన
కాకతీయ, కొత్తగూడెం: కార్మికవ్యతిరేకవ్యాఖ్యలనుకప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంఘం ఐఎన్టీయుసి నాయకులు సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట దొంగ నిరసన దీక్షలు చేస్తుందని ఏఐటియుసి అనుబంధం సింగరేణి కాలనీ, వర్కర్స్ యూనియన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులపై చేస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా గుర్తింపు కార్మిక సంఘం ఎఐటియుసి ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియాలో పివికే 5 గని కార్మికులు వినూత్నంగా శనివారం రాష్ట్ర ప్రభుత్వనీకి నిరసనసెగ తగిలే విధంగా నల్ల రిబ్బన్లు మొఖానికి కట్టుకుని ప్ల కార్డ్స్ తో నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి వినతిపత్రం అందచేశారు. సింగరేణి కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా సింగరేణి కార్మికుల కుటుంబల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల మెడికల్ అన్ ఫిట్ వల్ల సింగరేణిపై ఆర్ధిక భారం పడిందని అసెంబ్లీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్మిక వ్యతిరేక వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కార్మికులకు పాత పద్ధతిలో మెడికల్ బోర్డును నిర్వహించాలని డిమాండ్ చేశారు. అండర్ గ్రౌండ్ లో విధులు నిర్వహిస్తున్న జనరల్ అసిస్టెంట్స్ ను సర్ఫేస్ కన్వర్షన్ చేసి ఏరియాలో ఖాళీలు భర్తీ చేయడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జున్ రావు, సహాయ కార్యదర్శి గట్టయ్య, ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్, ఎస్ నాగేశ్వరరావు, పివికే 5 పిట్ కార్యదర్శి భుక్య రమేష్, ఏరియా స్టోర్స్ పిట్ కార్యదర్శి కమల్, అసిస్టెంట్ ఫిట్ సందీప్ సేఫ్టీ కమిటీ సభ్యులు రామచందర్ మహేష్, సుమన్, కుమార్ రావు, జనరల్ షిఫ్ట్ ఇంచార్జ్ సంజీవ్, సుభాష్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ లక్ష్మణ్ జాయింట్ సెక్రెటరీ దేవ సింగ్, గణేష్, నరేష్, ఫక్రుద్దీన్, శివ, వినోద్, సురేష్, సంతానం, దాసరి శీను, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.


