epaper
Thursday, January 15, 2026
epaper

మేయర్ పీఠం బీజేపీదే

మేయర్ పీఠం బీజేపీదే
ఎన్నికలప్పుడే మైనార్టీలు గుర్తుకు వస్తారా?
మైనార్టీలను మోసం చేసేందుకు త్రిపక్ష కుట్ర
కాంగ్రెస్–బీఆర్‌ఎస్–ఎంఐఎం కుమ్మక్కు
కరీంనగర్ అభివృద్ధి కేంద్ర నిధుల వల్లే
బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ సమీ పర్వేజ్

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి మైనార్టీలను మోసం చేసే రాజకీయ కుట్రకు తెరలేపాయని బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ సమీ పర్వేజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ కార్పొరేషన్ ఎన్నికల కోసం రాజకీయ డ్రామాలు మొదలుపెట్టిందని విమర్శించారు. కరీంనగర్ నగర అభివృద్ధి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమైందని సమీ పర్వేజ్ పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెచ్చిన నిధులతో పట్టణంతో పాటు మైనార్టీ డివిజన్లలో అభివృద్ధి జరిగిందన్నారు. సుకన్య సమృద్ధి యోజన, ఉజ్వల యోజన, వీధి వ్యాపారుల రుణాలు, పీఎంఈజీపీ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మైనార్టీలకు గణనీయమైన లబ్ది చేకూరిందని తెలిపారు.

ఓటు బ్యాంకుగానే మైనార్టీలు?
ఎన్నికలు వచ్చినప్పుడే మైనార్టీలు ఎంఐఎం పార్టీకి గుర్తుకు వస్తారని, ఆ తర్వాత వారి సమస్యలపై స్పందించిన దాఖలాలు లేవని విమర్శించారు. గతంలో టీఆర్‌ఎస్‌తో, ప్రస్తుతం కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకొని మైనార్టీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటోందని ఆరోపించారు. కుల, మతాలకతీతంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని, నిజమైన మైనార్టీ సంక్షేమం బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగురుతుందని, మేయర్ పీఠం కూడా బీజేపీదేనని మొహమ్మద్ సమీ పర్వేజ్ ధీమా వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img