epaper
Thursday, January 15, 2026
epaper

విద్యార్థి శ్రీ వ‌ర్షిత మృతికి ప్ర‌భుత్వ‌మే కార‌ణం

  • గురుకులాల‌పై ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం కొన‌సాగుతోంది
  • విద్యార్థి మృత‌దేహంతో హుజురాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధర్నా
  • బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాల‌ని డిమాండ్

కాకతీయ, హుజురాబాద్: హ‌న్మ‌కొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గురుకుల హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్న శ్రీ వర్షిత ఆత్మహత్య ఘటనపై హుజరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థిని మృతదేహంతో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి ధర్నా నిర్వహించారు. రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీ వర్షిత మృతదేహానికి హుజరాబాద్ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్వయంగా మృతదేహాన్నీ మోసుకుంటూ ఆసుపత్రి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం చౌరస్తాలో మృతదేహాన్ని ఉంచి బైఠాయించి ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యమే బాలిక మృతికి కార‌ణ‌మంటూ నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురుకుల పాఠశాలల నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అమాయక గురుకుల విద్యార్థులు బలవుతున్నారని మండిపడ్డారు. ​శ్రీ వర్షిత కుటుంబానికి తక్షణమే రూ. 1 కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉదయం తల్లిదండ్రులతో మాట్లాడిన విద్యార్థిని వెంటనే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన గురుకుల ప్రిన్సిపాల్, సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి, డిమాండ్లను తెలియజేయగా కలెక్టర్ ఈ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీ ఇచ్చారు.

కలెక్టర్ హామీతో ఎమ్మెల్యే ధర్నాను విరమించారు. అనంతరం మృతదేహంతో రాంపూర్ గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలపై ప్రభుత్వం నుంచి తక్షణమే విచారణ మరియు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని విద్యార్థి, ప్రజా సంఘాలు సైతం డిమాండ్ చేశాయి. మృతురాలు శ్రీ వర్షిత తండ్రి వనం తిరుపతి ఫిర్యాదు మేరకు వంగర పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమార్తె ఆత్మహత్యకు స్కూల్ ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది ఒత్తిడి కారణమని ఆయన ఆరోపించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img