మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం
డాక్టర్ అవినాష్
పాతర్లపాడు పీహెచ్సీలో మెగా హెల్త్ క్యాంప్
కాకతీయ, కూసుమంచి : పల్లెల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామని డాక్టర్ అవినాష్ తెలిపారు. శనివారం తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని పీహెచ్సీలో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రజలకు అందుబాటులోనే అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు ఈ శిబిరం ఉపయోగపడుతుందని తెలిపారు. శిబిరానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఆరోగ్య సమస్యలను వివరించారు. ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, స్త్రీ రోగాలు, పిల్లల వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఆయుష్ వైద్య సేవలు కూడా అందించామని చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డీఎంహెచ్వో రామారావు శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సదుపాయాలను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు పెంపొందించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
గ్రామ సర్పంచ్ జడల సుష్మ, ఉపసర్పంచ్ జడల రమేష్ శిబిరాన్ని ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామస్థులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరవింద, డాక్టర్ భవాని, డాక్టర్ మనుష, డాక్టర్ ఫాతిమా, డాక్టర్ పూజిత, గుంతేటి కనకలక్ష్మి, నిర్మల జ్యోతి, రామయ్య, గౌతమ్, సీత, విజయలక్ష్మి, ప్రశాంతి, నాగవేణి, మానస, సంధ్య, పద్మ, మంజుల, జ్యోతి, జయమ్మ, శ్రీదేవి, జడల నాగేష్, రామసాయం వెంకట్ రెడ్డి, చీకటి శ్రీను, నేలమర్రి నాగేందర్, నేలమర్రి రాములు తదితరులు పాల్గొన్నారు.


