epaper
Saturday, March 7, 2026
epaper

తొర్రూరు అభివృద్ధే లక్ష్యం

తొర్రూరు అభివృద్ధే లక్ష్యం
కమ్యూనిటీ హాళ్లతో అన్ని వర్గాలకు మేలు
మినీ ట్యాంక్ బండ్‌తో పెరిగిన‌ పట్టణ సౌందర్యం
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు అవసరం
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

కాకతీయ, తొర్రూరు : తొర్రూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలబెట్టేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ. ఆరు కోట్లు డెబ్బై ఐదు లక్షల వ్యయంతో నిర్మించిన ధోబి ఘాట్, స్మశాన వాటిక, మైత్రి భవన్ కమ్యూనిటీ హాల్, పద్మశాలి, స్వామి వివేకానంద, గౌడ సంఘం, నాయి బ్రాహ్మణ, విశ్రాంత ఉద్యోగుల, ఎస్సీ కమ్యూనిటీ హాళ్లను స్థానిక నాయకులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ సామాజిక వర్గాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఆయా వర్గాలకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

బీఆర్ఎస్‌ శంకుస్థాపనలకే పరిమితం..!

గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమితమై పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో అనేక అభివృద్ధి పనులను పూర్తి చేసి చూపించామని అన్నారు. తొర్రూరును స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పట్టణవాసులకు ఆహ్లాదాన్ని అందించేలా టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ. మూడు కోట్లతో పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పనులు పూర్తయితే ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు సేదతీరే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే సుందరీకరణ పనులు పూర్తి చేసి తొర్రూరును అందమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. మంచినీటి సమస్యకు పరిష్కారంగా ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

సంక్షేమ పథకాలతో పేదలకు భరోసా

రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా తొర్రూరును తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మున్సిపాలిటీలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించి, అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి మరో పదిహేను కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వక్కల శ్యాంసుందర్, టీపీసీసీ మాజీ సభ్యుడు ముత్తినేని సోమేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్యా నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మేకల కుమార్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య, పోనుగొట్టి సోమేశ్వరరావు, చాపల అనిత బాపురెడ్డి, గంజి విజయపాల్ రెడ్డి, మంగళపల్లి రామచంద్రయ్య, జీనుగా సురేందర్ రెడ్డి, యాకూబ్ రెడ్డి, నరసయ్య, మహిళా బ్లాక్ అధ్యక్షురాలు పింగిలి ఉష పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం

మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం మంత్రి కొండా సురేఖ ​శివ నగర్‌లో కుట్టు మిషన్ల పంపిణీ 35వ...

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి కాకతీయ, చెన్నారావుపేట: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ...

ఘ‌నంగా మ‌హిళా దినోత్స‌వం

ఘ‌నంగా మ‌హిళా దినోత్స‌వం కాకతీయ, ఏటూరునాగారం : మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ...

అగ్ని ప్ర‌మాదాలపై అవగాహన

అగ్ని ప్ర‌మాదాలపై అవగాహన కాకతీయ, ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీవివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో...

మెమోలు వచ్చినా… “అను”భవం మారాధా..!?

మెమోలు వచ్చినా… “అను”భవం మారాధా..!? కొమ్మాల దేవస్థానంలో మహిళా ఉద్యోగి వింత పోకడలు డ్రెస్...

పట్టణాభివృద్ధే లక్ష్యం

పట్టణాభివృద్ధే లక్ష్యం చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీరామానంద్ కాకతీయ, నర్సంపేట టౌన్: పట్టణాన్ని అన్ని రంగాల్లో...

ప్రభుత్వ పథకాలు

ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరాలి సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి దిశ...

వాలమ్తారి భూముల‌ను

వాలమ్తారి భూముల‌ను విద్యాసంస్థ‌ల‌కు కేటాయించండి ముఖ్యమంత్రికి జీవన్ రెడ్డి వినతి కాకతీయ, జగిత్యాల : జగిత్యాల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img