మున్సిపాలిటీ అభివృద్ధే ధ్యేయం
కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మార్చి 6, 2026 నుండి మార్చి 15, 2026 వరకు పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మునిసిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో పాల్గొంటానని ప్రతిజ్క్ష చేశారు. కార్యక్రమంలో కమిషనర్ ఆయాజ్, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్స్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


