epaper
Monday, March 2, 2026
epaper

రాజ‌కీయాల్లో ధ‌న ప్ర‌వాహం ఎక్కువ‌వుతోంది..!

రాజ‌కీయాల్లో ధ‌న ప్ర‌వాహం ఎక్కువ‌వుతోంది..!
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు
డబ్బు ప్రభావంతో విలువ కోల్పోతున్న ప్రజాస్వామ్యం
ఓటుకు 6 వేల నుంచి 10 వేల వరకు పంపకాలు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ప్రస్తుత రాజకీయ వాతావరణం చూస్తే సామాన్యుడు రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ 52వ డివిజన్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం ప్రతి పౌరుడి పవిత్ర బాధ్యత అని పేర్కొన్న గంగుల, ప్రస్తుత పరిస్థితులు ఆ హక్కు విలువను తగ్గించేలా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో ప్రతి ఎన్నికలో పోలింగ్ శాతం సాధారణంగా 50 నుంచి 60 శాతం మధ్యే నమోదవుతుందని గుర్తు చేస్తూ, ఈసారి మాత్రం ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా పనిచేసే నిజాయితీ గల నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని కోరారు. అయితే ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం బహిరంగంగానే కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.

ఓటుకు నోటు – ప్రమాదకర ధోరణి

ఒక్కో ఓటుకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు డబ్బు పంపిణీ జరుగుతోందన్న సమాచారం తనకు అందిందని గంగుల వెల్లడించారు. ఒకే డివిజన్‌లో అభ్యర్థి సుమారు రూ.3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో పదవి అంటే సేవ చేయడం అని, అలాంటిది ఇంత భారీగా ఖర్చు చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శుభసూచకం కాదని, తన 27 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి దుస్థితిని ఎప్పుడూ చూడలేదని స్పష్టం చేశారు. డబ్బు ఆధారంగా గెలిచినా అభివృద్ధి చేయాలన్న సంకల్పం లేకపోతే ప్రజలకు ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల పదవీకాలం తర్వాత ప్రజలకు లాభం చేకూర్చే నాయకత్వమే అవసరమని సూచించారు.

కరీంనగర్‌లో హంగ్ పరిస్థితి?

కరీంనగర్ కార్పొరేషన్ చరిత్రను ప్రస్తావిస్తూ, ఎక్కువసార్లు కూటముల ఆధారంగానే నాయకత్వం ఏర్పడిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని ఎన్నికల్లో ఒకే పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చినా, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో స్పష్టమైన నమ్మకం కనిపించడం లేదని, అందువల్ల ఈసారి ఏ పార్టీకి కూడా 34 స్థానాల స్పష్టమైన మెజారిటీ దక్కే అవకాశాలు లేవని అంచనా వేశారు. ప్రధాన పార్టీలు గరిష్ఠంగా 20 నుంచి 21 స్థానాల వరకే పరిమితమయ్యే పరిస్థితి ఉందని, స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. ఎవరైనా మేయర్‌గా ఎన్నికైనా బాధ్యతతో పనిచేయాలని, భారీగా ఖర్చు పెట్టి గెలిచామనే భావనతో కాకుండా నగరాభివృద్ధినే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. కరీంనగర్ ప్రజలు తమ నగర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించి ఓటు వేయాలని గంగుల విజ్ఞప్తి చేశారు. ఎన్నికల వేళ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కరీంనగర్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img