epaper
Saturday, November 15, 2025
epaper

తిరోగమన’ వర్షాలు తెచ్చిన‌ తిప్పలు..!

  • నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షం
  • పెద్దఎత్తున నీటమునిగిన పంటలు
  • అతలాకుతలమైన అన్న‌దాత‌
  • నల్లబెల్లిలో అత్యధికంగా 91.8 మిల్లీమీటర్ల వర్షపాతం

కాకతీయ, నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సోమవారం తెల్లవారు జాము నుంచి వాన దంచికొట్టింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. డివిజన్‌ పరిధిలోని నల్లబెల్లి మండలంలో జిల్లాలోనే అత్యధికంగా 91.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నర్సంపేట మండలంలో అత్యల్పంగా 52. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా దుగ్గొండిలో 88.6 మిల్లీమీటర్లు, నెక్కొండలో 71.4 మిల్లీమీటర్లు, ఖానాపూర్ లో 54.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

తీవ్ర పంట నష్టంతో రైతన్నవేద‌న‌..

అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున వరి, మిర్చి, పసుపు పత్తి తదితర పంటలు నీటమునిగాయి. వరిపంట పొట్టకొచ్చే సమయంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ లో మొక్కజొన్న వేసిన రైతులు పంట కోసి ఆరబోతకోసం రోడ్లపై ఉంచిన మక్కలను వర్షం కారణంగా కాపాడుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. గత నెలలో కురిసిన వర్షాలతోనే సమయానికి కోయాల్సిన పంట ఆలస్యంగా కోయగా మళ్ళీ పడుతున్న వర్షాలతో అన్నదాతల భాదలు వర్ణణతీతం. నియోజకవర్గంలోని నెక్కొండ మండలంలోని చంద్రుగొండలో పిడుగుపాటుతో రెండు పాడిగేదెలు మృతి చెందాగా, పలు రోడ్లపై నుంచి వరద పొంగి ప్రవహించడంతో గంటల తరబడి రాకపోకలు స్తంభించాయి.

బాధిత రైతుల‌ను ప్రభుత్వం ఆదుకోవాలి

– ఆకుల శ్రీనివాస్, మాజీ జడ్పీ వైస్ ఛైర్మెన్, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా నాయకుడు
భారీ వర్షంతో నష్టపోయిన రైతుల ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆరబోసుకున్న మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయన్నారు. అకాల వర్షం కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

రికార్డు స్థాయిలో వర్షపాతం..

సోమవారం తెల్లవారుజామున కురిసిన వర్షాలకు మండలంలోని రైతులకు అపార నష్టం వాటిల్లింది. మండల పరిధిలో పత్తిపంట 3,500 ఎకరాలు, మొక్కజొన్న 750 ఎకరాలు, మిర్చి పంటలు మొత్తం 11,000 ఎకరాల్లో తీవ్ర నష్టం కలిగినట్లు అన్నదాతలు బోరుమంటున్నారు. వర్షంతో కొంతమేర కోసిన మొక్కజొన్న రోడ్లమీద ఆరబోసిన మొక్కజొన్న తడిసి ముద్దయింది. అంతంత మాత్రంగానే వస్తున్న పత్తి దిగుబడి, ఈ అకాల వర్షాలతో పూర్తిగా నీటిపాలైంది. అధికారుల అంచనా ప్రకారం, వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండలంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ నెలలో కూడా వర్షపాతం కొనసాగడం వల్ల భూమిలో నీటి శాతం పెరిగి, పడిన చినుకు పైనే నిలుస్తోంది. దీంతో పంటల్లో ఏరుకుళ్ళు, కాండంకుళ్లు వ్యాప్తి చెందడం వల్ల రైతన్నకు నిరాశ తప్పేలా లేదని వాపోతున్నారు. ఇప్పటికే సాగు భూముల్లో నీరు నిలిచిపోవడం, ఆకస్మిక వరదల కారణంగా పలు పంటలు పూర్తిగా చెరిగిపోయి, రైతులు ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నారు.రైతులు ప్రభుత్వాన్ని తక్షణమే స్పందించాలని, నష్టం అంచనా వేసి సకాలంలో నష్టపరిహారం అందించాలని వారు కోరుతున్నారు.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ ప్రజెంటేషన్ లను సమీక్షించిన కూడా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img