epaper
Saturday, November 15, 2025
epaper

తుది దశలో మావోయిస్టుల నిర్మూలన

  • పోలీసుల త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదు
  • ప్రజాస్వామ్యంలో తుపాకీ ఉండాల్సింది పోలీసుల చేతుల్లోనే..
  • కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, బండి సంజయ్

కాకతీయ, తెలంగాణ బ్యూరో : దేశ రక్షణ, శాంతి పరిరక్షణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, బండి సంజయ్ కుమార్ ఘన నివాళి అర్పించారు. న్యూఢిల్లీలోని చాణిక్యపురి జాతీయ పోలీస్ స్మారక స్థూపం వద్ద మంత్రులు అమర వీరుల సేవలను స్మరిస్తూ పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘పోలీస్ వీరులారా, మీ త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరవదు. మీ ధైర్యం, సాహసం, నిబద్ధత మనందరికీ స్ఫూర్తిదాయకం. ప్రజాస్వామ్యంలో తుపాకీ ఉండాల్సింది పోలీసుల, సైనికుల చేతుల్లోనే. బుల్లెట్‌ను నమ్ముకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారు, కానీ బ్యాలెట్‌ను నమ్మినవారు ప్రజాస్వామ్యంలో చిరస్థాయిగా నిలిచారని’ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక ఉద్యమాల్లో చివరికి గెలిచింది బ్యాలెట్ మాత్రమేనని, బుల్లెట్ ద్వారా సాధించిందేమీ లేదని స్పష్టం చేశారు. బీజేపీ ఆరంభం నుండి హింస, బుల్లెట్ రాజకీయానికి వ్యతిరేకమని తెలిపారు. దేశవ్యాప్తంగా మావోయిస్టు నిర్మూలన తుది దశకు చేరుకుందని, రాబోయే మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడం తథ్యమని బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. పోలీసుల త్యాగాలను గుర్తుంచుకుని దేశ భద్రత, సమగ్రత కోసం అందరం కట్టుబడాలని ఆయన అన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమరవీరుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించి, వారి త్యాగం దేశాన్ని సురక్షితంగా ఉంచిందన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర పోలీసుల స్ఫూర్తితో శాంతి, క్రమశిక్షణ, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు పునరుద్ఘాటించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్ కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం ముఖ్యమంత్రి...

కేటీఆర్ బ‌క్వాస్‌..

కేటీఆర్ బ‌క్వాస్‌.. ఆయ‌న మాట‌లు న‌మ్మొద్దు వ‌చ్చే ఐదేండ్లు రేవంత్ సీఎంగా ఉంటారు న‌వీన్ యాదవ్‌ను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img