చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయం
ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం
సీఐ వి విజయ్ రామ్ కుమార్
కాకతీయ,బోనకల్ : వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతో ఉపయుక్తమని సీఐ వి విజయ్ రామ్ కుమార్ అన్నారు. మంగళవారం బోనకల్ మండల కేంద్రంలో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించారు. వివి గార్డెన్ అధినేత వెన్నబోయిన వెంకటేశ్వరరావు, షేక్ మీరా సాహెబ్, బోడ యోగి ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. సీఐ వి విజయ్ రామ్ కుమార్ మాట్లాడుతూ, వేసవిలో తాగునీటి సౌకర్యం కల్పించడం గొప్ప సేవ అని అన్నారు. ప్రజలు చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తహసిల్దార్ మద్దెల రమాదేవి కూడా దాతల సేవలను అభినందించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని తహసిల్దార్ మద్దెల రమాదేవి ప్రారంభించారు. ఖమ్మం బస్టాండ్ సెంటర్ వద్ద సీఐ వి విజయ్ రామ్ కుమార్ ప్రారంభించారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో రురావత్ రమాదేవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పొదిలి వెంకన్న, మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య, సర్పంచ్ బానోతు జ్యోతి, చింతల చెరువు కోటేశ్వరరావు, కిలారు సురేష్, నిమ్మతోట వెంకటలక్ష్మి, బానోతు కొండ, కోలా రాజేశ్వరి, పంతంగి రమాదేవి, టి స్వర్ణమార్తమ, పోటు వెంకటేశ్వర్లు, గ్రామపంచాయతీ సభ్యులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


