epaper
Thursday, January 15, 2026
epaper

మోంథా పంటనష్టం 1890 ఎకరాలు మాత్రమే

మోంథా పంటనష్టం 1890 ఎకరాలు మాత్రమే

వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా 6000 ఎకరాలు
చివరికి తేలిన పంట నష్టం1890 ఎకరాలు…
పంటలో 33 శాతం కంటే ఎక్కువ నష్టపోతేనే సర్వేలో పేరు ఉన్నట్టు..
సోమవారం నాటికీ యాప్ లో ఎంట్రీతో సర్వే క్లోజ్..
మరింత గడువు పెంచాలని వేడుకుంటున్న రైతాంగం…

కాకతీయ, ఖానాపురం : మోంథా తుఫాను వల్ల ఖానాపురం మండలంలో ఈదురు గాలులతో కురిసిన అతి భారీ వర్షాలకు నష్టపోయిన పంటలు చివరికి మండల వ్యాప్తంగా 21 గ్రామపంచాయతీలో 1890 ఎకరాలు మాత్రమే తేలినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారుల గణాంకాలు జిల్లా ఉన్నత అధికారులకు అందించినట్లు తెలిపారు. గత అక్టోబర్ నెల చివరి వారంలో తెలంగాణ రాష్ట్రంలో సంభవించిన మోంథా తుఫాన్ వల్ల ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షాలకు పాకాల ఆయకట్టు పరిధిలో అధికారిక అనధికారిక లెక్కల ప్రకారం 30 వేల ఎకరాలకు గాను.. 6వేల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేసి జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించారు. నేలకొరిగిన వరి పంట నష్టాన్ని ఫీల్డ్ ద్వారా సర్వే చేపట్టిన వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు వరి పంటలో 33 శాతం దిగుబడి కంటే ఎక్కువ నష్టపోతేనే పరిగణలోకి తీసుకొని, చివరికి మండలంలోని 21 గ్రామపంచాయతీల్లో కేవలం 1890 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు, ఇట్టి పంటనష్ట సర్వేను యుద్ధ ప్రాతిపదికన నవంబర్ 10 తారీఖు నాటికీ ప్రభుత్వం సూచించిన యాప్ లో నమోదు చేసి పంట నష్ట సర్వేను ముగించినట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా నష్టపోయిన పంటల్లో పత్తి, మొక్కజొన్న పంటలు లేకపోవడం గమనార్హం. తుఫాన్ కంటే ముందు యూరియా కొరతతో పంటల దిగుబడి తగ్గితే నేడు తుఫాన్ ఎఫెక్ట్ వల్ల పత్తి మొక్కజొన్న పంటలు పూర్తిగా తడిసి రైతులు అపార నష్టం వాటిల్లితే ప్రభుత్వం గుర్తించకపోవడం చాలా బాధాకరమని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పంటనష్ట గడువును మరిన్ని రోజులు పొడగించాలని కోరుతున్నారు.

పంట నష్ట సర్వే నివేదికను ప్రభుత్వానికి అందించాం
– భోగ శ్రీనివాస్ మండల వ్యవసాయ అధికారి

మొంథా తుఫాన్ వల్ల నేలకొరిగిన వరి పంటను పరిశీలించి పంట నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించినట్లు తెలిపారు. మొక్కజొన్న, పత్తి పంటలో 70 శాతం మేర పంట తీసినందున వాటిని పరిగణలోకి తీసుకోలేదని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img