epaper
Saturday, November 15, 2025
epaper

మోంథా పంటనష్టం 1890 ఎకరాలు మాత్రమే

మోంథా పంటనష్టం 1890 ఎకరాలు మాత్రమే

వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా 6000 ఎకరాలు
చివరికి తేలిన పంట నష్టం1890 ఎకరాలు…
పంటలో 33 శాతం కంటే ఎక్కువ నష్టపోతేనే సర్వేలో పేరు ఉన్నట్టు..
సోమవారం నాటికీ యాప్ లో ఎంట్రీతో సర్వే క్లోజ్..
మరింత గడువు పెంచాలని వేడుకుంటున్న రైతాంగం…

కాకతీయ, ఖానాపురం : మోంథా తుఫాను వల్ల ఖానాపురం మండలంలో ఈదురు గాలులతో కురిసిన అతి భారీ వర్షాలకు నష్టపోయిన పంటలు చివరికి మండల వ్యాప్తంగా 21 గ్రామపంచాయతీలో 1890 ఎకరాలు మాత్రమే తేలినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారుల గణాంకాలు జిల్లా ఉన్నత అధికారులకు అందించినట్లు తెలిపారు. గత అక్టోబర్ నెల చివరి వారంలో తెలంగాణ రాష్ట్రంలో సంభవించిన మోంథా తుఫాన్ వల్ల ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షాలకు పాకాల ఆయకట్టు పరిధిలో అధికారిక అనధికారిక లెక్కల ప్రకారం 30 వేల ఎకరాలకు గాను.. 6వేల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేసి జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించారు. నేలకొరిగిన వరి పంట నష్టాన్ని ఫీల్డ్ ద్వారా సర్వే చేపట్టిన వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు వరి పంటలో 33 శాతం దిగుబడి కంటే ఎక్కువ నష్టపోతేనే పరిగణలోకి తీసుకొని, చివరికి మండలంలోని 21 గ్రామపంచాయతీల్లో కేవలం 1890 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు, ఇట్టి పంటనష్ట సర్వేను యుద్ధ ప్రాతిపదికన నవంబర్ 10 తారీఖు నాటికీ ప్రభుత్వం సూచించిన యాప్ లో నమోదు చేసి పంట నష్ట సర్వేను ముగించినట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా నష్టపోయిన పంటల్లో పత్తి, మొక్కజొన్న పంటలు లేకపోవడం గమనార్హం. తుఫాన్ కంటే ముందు యూరియా కొరతతో పంటల దిగుబడి తగ్గితే నేడు తుఫాన్ ఎఫెక్ట్ వల్ల పత్తి మొక్కజొన్న పంటలు పూర్తిగా తడిసి రైతులు అపార నష్టం వాటిల్లితే ప్రభుత్వం గుర్తించకపోవడం చాలా బాధాకరమని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పంటనష్ట గడువును మరిన్ని రోజులు పొడగించాలని కోరుతున్నారు.

పంట నష్ట సర్వే నివేదికను ప్రభుత్వానికి అందించాం
– భోగ శ్రీనివాస్ మండల వ్యవసాయ అధికారి

మొంథా తుఫాన్ వల్ల నేలకొరిగిన వరి పంటను పరిశీలించి పంట నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించినట్లు తెలిపారు. మొక్కజొన్న, పత్తి పంటలో 70 శాతం మేర పంట తీసినందున వాటిని పరిగణలోకి తీసుకోలేదని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ ప్రజెంటేషన్ లను సమీక్షించిన కూడా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img