epaper
Sunday, March 1, 2026
epaper

కరీంనగర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే

కరీంనగర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే
సీఎం సభ విజయవంతం చేయాలి
కార్పొరేటర్ అభ్యర్థులతో మంత్రి తుమ్మల కీలక సమావేశం
ప్రతి డివిజన్ నుంచి భారీగా జనసమీకరణకు పిలుపు
అభ్యర్థుల ఎంపిక నిబద్ధత ఆధారంగానే జరిగిందని స్పష్టం

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాల్సిందేనని జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎన్నికల పోరులో పార్టీ అభ్యర్థులందరూ సమన్వయంతో పనిచేయాలని, ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయడమే గెలుపుకు పునాది అవుతుందని అన్నారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ అంజన్ కుమార్ అధ్యక్షతన కార్పొరేటర్ అభ్యర్థులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొని ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.

సీఎం సభే కీలక మలుపు

మానకొండూర్ ఎమ్మెల్యే, పీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, చొప్పదండి గుమలాపూర్‌లో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను ప్రతి ఒక్కరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఎన్నికలకు మిగిలిన కొద్ది రోజులు అభ్యర్థులు మరింత ఉత్సాహంగా ప్రచారం నిర్వహించాలని, ఈ సభే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి మార్గం వేస్తుందని అన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలు ప్రజల కోసమే పనిచేస్తున్నారని తెలిపారు. సుడా పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని, అవసరమైతే డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ జెండా ఎగరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కరీంనగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ, సీఎం సభకు ప్రతి డివిజన్ నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలను తరలించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. డాక్టర్ అంజన్ కుమార్ మాట్లాడుతూ, సీఎం సభ తర్వాత ఓటర్లలో కాంగ్రెస్ పట్ల మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందని, పార్టీ విజయావకాశాలు స్పష్టంగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక పూర్తిగా నిబద్ధత, సేవా తత్పరత ఆధారంగానే జరిగిందని స్పష్టం చేశారు. ఎలాంటి పైరవీలు, ఆర్థిక లావాదేవీలకు తావులేకుండా అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. పార్టీ కోసం శ్రమించిన వారికి భవిష్యత్తులో నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి డివిజన్‌లో విస్తృత ప్రచారం

ప్రతి అభ్యర్థి తన డివిజన్‌లో ప్రతి ఓటరును నేరుగా కలవాలని, ఇంటింటి ప్రచారం మరింత వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి సభకు ప్రతి డివిజన్ నుంచి కనీసం 500 మందిని తరలించాలని ఆదేశించారు. రేపటి సభ విజయవంతమైతే కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ హౌస్‌ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, పార్టీ నాయకులు, కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img