మరిపెడలో కాంగ్రెస్ జెండా ఎగిరింది..!
15 వార్డుల్లో 8 గెలిచి మున్సిపాలిటీ కైవసం
బీఆర్ఎస్కు 6 స్థానాలు.. ఇండిపెండెంట్కు ఒకటి
చైర్మన్ పీఠంపై కాంగ్రెస్ పట్టు
కాకతీయ, మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యంతో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. మొత్తం 15 వార్డుల్లో 8 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ పూర్తి మెజార్టీ సాధించగా, బీఆర్ఎస్ 6 వార్డులకు పరిమితమైంది. ఒక వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో మరిపెడ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయమైంది. ప్రారంభం నుంచే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఇస్లావత్ తిరుపతి విజయం సాధించగా, 2వ మరియు 3వ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బానోత్ భద్రమ్మ, బానోత్ కిషన్ గెలిచారు. 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మెరుగు రాము విజయం సాధించగా, 5వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బోడ భాస్కర్ గెలిచారు.
కీలక వార్డుల్లో కాంగ్రెస్ ఆధిపత్యం
6వ వార్డు నుంచి కాంగ్రెస్ దూకుడు పెంచింది. కలం సునీత, మండం కాంతమ్మ, ప్రగతి విసారపు, గుగులోత్ నీలా వరుసగా విజయం సాధించి కాంగ్రెస్ బలాన్ని పెంచారు. దీంతో మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. అయితే 10వ, 11వ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బేబీ శ్రీ, లావుడియా సత్యవతి గెలిచి పార్టీకి ఊపిరి పోశారు.
ఇండిపెండెంట్ ప్రభావం.. తుది ఫలితాల్లో కాంగ్రెస్ పైచేయి
12వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గంట్ల గౌతమ్ రెడ్డి విజయం సాధించడం విశేషం. 13వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గంట్ల సుజాత మహిపాల్ రెడ్డి గెలిచారు. చివరి రెండు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు జాటోత్ సురేష్, లునావత్ రమేష్ విజయం సాధించడంతో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీని ఖాయం చేసుకుంది.
మొత్తం ఫలితాల ప్రకారం కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్ 1 స్థానాన్ని గెలుచుకోగా, మరిపెడ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. ఈ విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తుండగా, బీఆర్ఎస్ శ్రేణులు ఫలితాలపై సమీక్ష ప్రారంభించాయి.


